ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP Vs YCP: టీడీపీ జెండాలను పీకేసీ.. బైక్‌తో తొక్కించి దారుణం

ABN, First Publish Date - 2023-08-04T16:09:02+05:30

జిల్లాలోని ఏ. కొండూరు మండలం కంభంపాడు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఎన్టీఆర్ జిల్లా: జిల్లాలోని ఏ. కొండూరు మండలం కంభంపాడు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలో టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పీకేసి వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. అదేమని అడిగిన టీడీపీ కార్యకర్తలపై చేయి కూడా చేసుకున్నారు. ఏ. కొండూరు మండలం కంభంపాడు గ్రామంలో టీడీపీ మహాశక్తి ఇంటింటి ప్రచారంలో భాగంగా టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. అయితే టీడీపీ ఇంటింటి ప్రచారాన్ని జీర్ణించుకోలేని వైసీపీ అల్లరి మూకలు గ్రామంలో ఏర్పాటు చేసిన టీడీపీ జెండాలను పీకేసి రోడ్డు పక్కన పడేసి పిరికిపంద చర్యలకు పాల్పడ్డారు. అంతే కాకుండా టీడీపీ జెండాలను రోడ్డుపై పడేసి చించి జెండాలపై బైక్‌తో తొక్కిస్తూ వైసీపీ అల్లరి మూకలు వికృత చేష్టలకు యత్నించారు. అదేమని అడిగిన టీడీపీ కార్యకర్తపై వైసీపీ కార్యకర్తలు చేయి చేసుకున్నారు.


టీడీపీ జెండాలు పీకివేయటంతో టీడీపీ నేతలు నిరసనకు దిగారు. టీడీపీ ఇంచార్జి శావల దేవదత్, టీడీపీ నేతలు, మహిళలు కంభంపాడు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. టీడీపీ జెండాలు తొలగించిన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకొనే వరకు రోడ్డుపైనే ధర్నా చేస్తానని పోలీసులను టీడీపీ నేతలు హెచ్చరించారు. అయితే టీడీపీ నేతల ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. వారిని బలవంతంగా ఏ.కొండూరు పోలీస్‌స్టేషన్‌‌కు తరలించారు. వైసీపీ నేతల చర్యలతో గ్రామంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

Updated Date - 2023-08-04T16:09:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising