Manipur : మయన్మార్ నుంచి మణిపూర్ రాష్ట్రానికి ఆగని అక్రమ వలసలు.. రెండు రోజుల్లో 718 మంది చొరబాటు..

ABN , First Publish Date - 2023-07-25T10:09:26+05:30 IST

మయన్మార్ నుంచి మణిపూర్ రాష్ట్రానికి అక్రమంగా తరలివస్తున్నారు. రెండు రోజుల్లోనే 718 మంది అక్రమంగా ఈ రాష్ట్రంలో చొరబడటంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సరిహద్దు భద్రత బాధ్యతను నిర్వహిస్తున్న అస్సాం రైఫిల్స్‌ను వివరణ కోరింది. సరైన పత్రాలు లేనివారిని భారత దేశంలోకి ప్రవేశించేందుకు ఏ విధంగా అనుమతించారని ప్రశ్నించింది.

Manipur : మయన్మార్ నుంచి మణిపూర్ రాష్ట్రానికి ఆగని అక్రమ వలసలు.. రెండు రోజుల్లో 718 మంది చొరబాటు..

న్యూఢిల్లీ : మయన్మార్ నుంచి మణిపూర్ రాష్ట్రానికి అక్రమంగా తరలివస్తున్నారు. రెండు రోజుల్లోనే 718 మంది అక్రమంగా ఈ రాష్ట్రంలో చొరబడటంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సరిహద్దు భద్రత బాధ్యతను నిర్వహిస్తున్న అస్సాం రైఫిల్స్‌ను వివరణ కోరింది. సరైన పత్రాలు లేనివారిని భారత దేశంలోకి ప్రవేశించేందుకు ఏ విధంగా అనుమతించారని ప్రశ్నించింది. వారిని వెంటనే దేశం నుంచి పంపించేయాలని ఆదేశించింది.

మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వినీత్ జోషీ సోమవారం రాత్రి అస్సాం రైఫిల్స్‌కు రాసిన లేఖలో, జూలై 22, 23 తేదీల్లో మయన్మార్ నుంచి అక్రమంగా 718 మంది భారత దేశంలో చొరబడ్డారని తెలిపారు. ఇటువంటి సంఘటనలు గతంలో జరిగినపుడు సరిహద్దు భద్రతా దళమైన అస్సాం రైఫిల్స్‌కు ఓ లేఖను రాష్ట్ర ప్రభుత్వం రాసిందని, అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారు చెల్లుబాటయ్యే వీసా/ట్రావెల్ డాక్యుమెంట్స్ చూపించకపోతే, దేశంలోకి ప్రవేశించనివ్వవద్దని చెప్పిందని గుర్తు చేశారు. ఇటువంటివారిని ఏ కారణంతోనూ రాష్ట్రంలో ప్రవేశించనివ్వొద్దని చెప్పినట్లు తెలిపారు. భారత ప్రభుత్వం, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ లేఖను రాసినట్లు తెలిపారు. ఈ మయన్మార్ జాతీయులను భారత దేశంలోకి ఎందుకు ప్రవేశించనిచ్చారో వివరణ ఇవ్వాలని అస్సాం రైఫిల్స్ అథారిటీని మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు తెలిపారు. వీరిని తక్షణమే భారత దేశం నుంచి పంపించేయాలని ఆదేశించినట్లు తెలిపారు.

చండేల్ జిల్లా డిప్యూటీ కమిషనర్‌కు అస్సాం రైఫిల్స్ రాసిన లేఖలో ఇండో-మయన్మార్ సరిహద్దుల్లోని చండేల్‌లోనికి జూలై 23న 718 మంది ప్రవేశించినట్లు తెలిపింది. ఖంపట్‌లో ఘర్షణల వల్ల వీరు రాష్ట్రంలోకి ప్రవేశించారని తెలిపింది. వీరి బయోమెట్రిక్స్, ఫొటోలు తీసుకుని, వీరిని వెంటనే దేశం నుంచి పంపించేయడానికి చేపడుతున్న చర్యలను చండేల్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్, డిప్యూటీ కమిషనర్లు పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

మహిళను కాల్చి చంపినట్లు వీడియోను ప్రచారం చేసినవారిపై కేసు

మణిపూర్‌‌లో సాయుధులు ఓ మహిళను కాల్చి చంపినట్లు కనిపిస్తున్న వీడియో బూటకపు వార్త అని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లర్లను రెచ్చగొట్టడం కోసమే ఈ బూటకపు వార్తను ప్రచారం చేశారని, దీనిని ప్రచారం చేసినవారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మణిపూర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 24న దీనిపై కేసును నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి :

CBSE: సీబీఎస్‌ఈలో తెలుగు మాధ్యమం

Premalatha: ప్రేమలత సంచలన వ్యాఖ్యలు.. ఆ రెండు పార్టీలూ ప్రజలకు చేసిందేమీ లేదు

Updated Date - 2023-07-25T10:09:26+05:30 IST