Earthquake: మణిపూర్‌లో మళ్లీ భూకంపం...భయాందోళనల్లో జనం

ABN , First Publish Date - 2023-02-04T08:33:33+05:30 IST

మణిపూర్‌లో శనివారం ఉదయం మళ్లీ భూకంపం సంభవించింది...

Earthquake: మణిపూర్‌లో మళ్లీ భూకంపం...భయాందోళనల్లో జనం
Earthquake in Manipur

ఉఖ్రుల్ (మణిపూర్): మణిపూర్‌లో శనివారం ఉదయం మళ్లీ భూకంపం సంభవించింది.(Earthquake) మణిపూర్‌లోని(Manipur) ఉఖ్రుల్‌లో శనివారం ఉదయం 6.14 గంటల ప్రాంతంలో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) తెలిపింది.ఈ భూకంపం వల్ల ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగినట్లు నివేదికలు రాలేదు. శుక్రవారం రాత్రి హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లోనూ భూకంపం సంభవించింది. ఈ భూకంపంతో మణిపూర్ ఉఖ్రుల్ నగర వాసులు తీవ్ర భయాందోళనలు చెందారు. భూమి కంపించడంతో ఉదయాన్నే ప్రజలంతా ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.

Updated Date - 2023-02-04T08:34:27+05:30 IST