ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pakistan : పాకిస్థాన్ విషయంలో భారత్ సంచలన నిర్ణయం

ABN, First Publish Date - 2023-01-26T12:02:33+05:30

అమలులో ఉన్న నిబంధనల ప్రకారం భుట్టో, గాంగ్‌లకు భారత ప్రభుత్వం ఆహ్వానాలను అందజేసింది.

Pakistan Prime Minister Shehbaz Sharif
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : గోవాలో మే నెలలో జరిగే షాంఘై సహకార సంఘం (SCO) సమావేశాలకు పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif)ను ఆహ్వానించాలని భారత్ నిర్ణయించింది. ఈ సమావేశాలకు హాజరుకావాలని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోను, చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్‌ను బుధవారం ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

అమలులో ఉన్న నిబంధనల ప్రకారం భుట్టో, గాంగ్‌లకు భారత ప్రభుత్వం ఆహ్వానాలను అందజేసింది. కానీ వీరు ఈ సమావేశాలకు హాజరయ్యేదీ, లేనిదీ ఇంకా స్పష్టత రాలేదు. దాదాపు పదేళ్ల క్రితం అప్పటి పాకిస్థానీ మంత్రి హీనా రబ్బానీ ఖర్ భారత్‌లో పర్యటించారు. ఆ తర్వాత పాకిస్థాన్ అగ్ర నేతలు భారత దేశంలో పర్యటించలేదు. షరీఫ్ కానీ, భుట్టో కానీ గోవా సమావేశాలకు హాజరవుతారో, లేదో చూడాలి.

మరికొద్ది రోజుల్లో ముంబైలో జరిగే ఎస్‌సీఓ చలన చిత్రోత్సవాల్లో పాకిస్థాన్ పాల్గొనడం లేదు. ఈ గ్రూప్‌లోని మిగిలిన దేశాలన్నీ తమ ఎంట్రీలను పంపించాయి.

Updated Date - 2023-01-26T12:02:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising