ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Udayanidhi: కొడనాడు వ్యవహారం.. మంత్రి ఉదయనిధికి స్టే కొనసాగింపు

ABN, First Publish Date - 2023-10-07T12:18:46+05:30

కొడనాడు హత్య, దోపిడీ వ్యవహారంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami)పై

పెరంబూర్‌(చెన్నై): కొడనాడు హత్య, దోపిడీ వ్యవహారంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi)కి మద్రాసు హైకోర్టు విధించిన నిషేధం పొడిగించింది. కొడనాడు వ్యవహారంలో తన పేరుకు కళంకం తెచ్చేలా మంత్రి ఉదయనిధి మాట్లాడుతున్నారని, ఈ వ్యవహారంపై తనపై వ్యాఖ్యలు చేసేందుకు మంత్రిపై స్టే విధించాలని, రూ.1.10 కోట్ల పరిహారం అందించాలని మద్రాసు హైకోర్టులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(AIADMK general secretary Edappadi Palaniswami) పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ విచారించిన న్యాయస్థానం, కొడనాడు వ్యవహారంలో పళనిస్వామిని ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలు చేయడంపై మంత్రి ఉదయనిధికి స్టే విధిస్తూ, ఈ కేసులో రెండు వారాల్లో బదులు పిటిషన్‌ దాఖలు చేయాలని మంత్రికి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, ఈ కేసు శుక్రవారం విచారణకు రాగా, బదులు పిటిషన్‌ దాఖలుకు అవకాశం కావాలని మంత్రి తరఫు న్యాయవాది కోరారు. దాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, తదుపరి విచారణ నవంబరు 2వ తేదీకి వాయిదా వేయడంతో పాటు మంత్రి ఉదయనిధికి విధించిన స్టే కూడా నవంబరు 2వ తేది వరకు పొడిగించింది.

Updated Date - 2023-10-07T12:18:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising