Reservation of train tickets: రేపటి నుంచి సంక్రాంతి రైలు టిక్కెట్ల రిజర్వేషన్
ABN, First Publish Date - 2023-09-12T10:26:13+05:30
వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా రైలు టిక్కెట్ల ముందస్తు రిజర్వేషన్ ఈనెల 13న బుధవారం నుంచి ప్రారంభం
పెరంబూర్(చెన్నై): వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా రైలు టిక్కెట్ల ముందస్తు రిజర్వేషన్ ఈనెల 13న బుధవారం నుంచి ప్రారంభం కానుంది. 2024వ సంవత్సరం సంక్రాంతి పండుగను జనవరి 15వ తేది ప్రజలు జరుపుకోనున్నారు. 16న తిరువళ్లువర్ దినోత్సవం, మాట్టు పొంగల్, 17న ఉళవర్ తిరునాళ్, కనుమ పండుగ సందర్భంగా వరుస సెలవులు రానున్నాయి. పండుగకు స్వగ్రామాలు, పొరుగూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు, రైళ్లు నడపనున్నారు. రైళ్ల రిజర్వేషన్ 120 రోజులకు ముందుగానే చేసుకొనే అవకాశముంది. ఈ క్రమంలో, జనవరి 11వ తేది ప్రయాణానికి ఈనెల 13వ తేది, జనవరి 12వ తేది ప్రయాణానికి ఈనెల 14న, జనవరి 13వ తేది ప్రయాణానికి ఈనెల 15వ తేది రిజర్వేషన్ చేసుకోవచ్చు. అలాగే, జనవరి 14వ తేది ప్రయాణానికి ఈ నెల 16న, జనవరి 15వ తేది ప్రయాణానికి ఈ నెల 17వ తేది రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఆయా రోజుల్లో ఉదయం 8 గంటలకు ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా, రైల్వేస్టేషన్లలోని బుకింగ్ కేంద్రాల ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చు.
Updated Date - 2023-09-12T10:26:15+05:30 IST