ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YCP Vs Congress : ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై చిదంబరం ఆగ్రహం

ABN, First Publish Date - 2023-08-02T10:58:13+05:30

సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం వైకాపా, బీజేడీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు-2023 (GNTC)కు ఎందుకు మద్దతిస్తున్నారని నిలదీశారు. ఢిల్లీలో అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు బదులుగా తీసుకొస్తున్న ఈ బిల్లుకు వైసీపీ, బీజేడీ ఎందుకు మద్దతిస్తున్నాయో తెలియడం లేదని వ్యాఖ్యానించారు.

P Chidambaram

న్యూఢిల్లీ : సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం (P Chidambaram) వైకాపా, బీజేడీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు-2023 (GNTC)కు ఎందుకు మద్దతిస్తున్నారని నిలదీశారు. ఢిల్లీలో అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు బదులుగా తీసుకొస్తున్న ఈ బిల్లుకు బీజేపీ ఎంపీలు మద్దతిచ్చారంటే అర్థం చేసుకోవచ్చునని, వైసీపీ, బీజేడీ ఎందుకు మద్దతిస్తున్నాయో తెలియడం లేదని వ్యాఖ్యానించారు.

ఎక్స్ (ట్విటర్) వేదికగా చిదంబరం వైసీపీ, బీజేడీలను తీవ్రంగా దుయ్యబట్టారు. ‘‘ఢిల్లీ సర్వీసుల అథారిటీ బిల్లుకు బీజేపీ ఎంపీలు మద్దతిస్తున్నారంటే అర్థం చేసుకోగలం. కానీ బీజేడీ, వైసీపీ ఈ బిల్లుకు ఎందుకు మద్దతిస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు’’ అని తెలిపారు. ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వం నియమించే ఇద్దరు అధికారులతో కూడిన త్రిసభ్య అథారిటీలో యోగ్యత ఉందని ఈ రెండు పార్టీలు గుర్తించాయా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన ఇద్దరు అధికారులు కోరం అవుతారని, వారిద్దరూ సమావేశాన్ని నిర్వహించి, ముఖ్యమంత్రి భాగస్వామ్యం లేకుండా నిర్ణయం తీసుకోవచ్చునని చెప్తున్న నిబంధన సరైనదేనని ఈ పార్టీలు గుర్తించాయా? ఈ ఇద్దరు అధికారులు ముఖ్యమంత్రిపై పైచేయిగా వ్యవహరించవచ్చుననే నిబంధనలో పస ఉందని భావిస్తున్నాయా? అథారిటీ ఏకగ్రీవ నిర్ణయాన్ని సైతం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తోసిపుచ్చవచ్చుననే నిబంధన సరైనదని భావిస్తున్నాయా? అని నిలదీశారు.

ఢిల్లీ రాష్ట్ర మంత్రుల ప్రమేయం లేకుండా, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంలో పని చేసే అధికారుల అధికారాలు, విధులను నిర్వచించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని చెప్తున్న నిబంధన సరైనదని భావిస్తున్నాయా? ఈ బిల్లు ఆమోదం పొందితే, అధికారులే యజమానులవుతారని, మంత్రులు వారికి క్రింది స్థాయివారిగా మారుతారని ఈ రెండు పార్టీలు అర్థం చేసుకున్నాయా? అని ప్రశ్నించారు.


ఈ బిల్లుకు మద్దతిస్తామని బీజేడీ మంగళవారం ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే పీ చిదంబరం స్పందించి ఈ ట్వీట్ చేశారు. బీజేడీ, వైసీపీ మద్దతుతో ఈ బిల్లు సునాయాసంగా ఆమోదం పొందగలదని బీజేపీ ధీమాగా ఉంది.

గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు-2023ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) లోక్‌సభ (Loksabha)లో మంగళవారం ప్రవేశపెట్టారు. ఈ ఆర్డినెన్స్‌పై బుధవారంనాడు లోక్‌సభలో చర్చ జరుగనుంది. ఢిల్లీలో చట్టాలు చేసే అధికారం కేంద్రానికి ఉంటుందని, ఇది రాజ్యాంగంలోనే ఉందని బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా అమిత్ షా అన్నారు. ఢిల్లీ స్టేట్‌కు సంబంధించి ఎలాంటి చట్టాన్నైనా పార్లమెంటు తీసుకురావచ్చని సుప్రీంకోర్టు సైతం చాలా స్పష్టంగా తీర్పునిచ్చిందని చెప్పారు. దీనిపై అభ్యంతరాలన్నీ రాజకీయపరమైనవేనని, బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతించాలని ఈ సందర్భంగా స్పీకర్‌ను అమిత్‌షా కోరారు. ఈ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకమంటూ విపక్షాలు పెద్దఎత్తున చేసిన నినాదాల మధ్య ఆయన సభలో దీనిని ప్రవేశపెట్టారు.


ఇవి కూడా చదవండి :

Special train: 5న వేలాంకన్నికి ప్రత్యేక రైలు

Haryana and Delhi : హర్యానాలో మత ఘర్షణలు.. ఢిల్లీలో గస్తీ ముమ్మరం..

Updated Date - 2023-08-02T11:00:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising