ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Same-sex marriage: స్వలింగ సంపర్క వివాహం సరైనదేనా?.. నేడే సుప్రీం తీర్పు

ABN, First Publish Date - 2023-10-17T09:11:21+05:30

భారతదేశంలో స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధంగా గుర్తించాలా వద్దా అనే అంశంపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. దీంతో సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఎలా ఉండబోతుందోననే ఉత్కంఠ నెలకొంది.

ఢిల్లీ: భారతదేశంలో స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధంగా గుర్తించాలా వద్దా అనే అంశంపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. దీంతో సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఎలా ఉండబోతుందోననే ఉత్కంఠ నెలకొంది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, ఎస్ రవీంద్ర భట్, హిమా కోహ్లీ, పీఎస్ నరసింహలతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశంపై తీర్పును మే 11న రిజర్వ్ చేసింది. తీర్పును రిజర్వ్ చేసిన 5 నెలల తర్వాత సర్వోన్నత న్యాయస్థానం నేడు తీర్పును వెలువరించనుంది. స్వలింగ సంపర్క వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన 20 పిటిషన్‌ల విచారణ పూర్తైన అనంతరం ధర్మాసనం మేలో తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. దీంతో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377ను కొట్టేసిన ఐదేళ్ల తర్వాత మనదేశంలో స్వలింగ వివాహాలను చట్టబద్ధంగా గుర్తించాలా వద్దా అనే అంశంపై అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించనుంది.


స్వలింగ జంటలు, లింగమార్పిడి వ్యక్తులు దాఖలు చేసిన 20 పిటిషన్లపై ఏప్రిల్ 18న సుప్రీంలో విచారణ ప్రారంభమైంది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సమక్షంలో జరిగిన ఈ విచారణ 10 రోజులపాటు సాగింది. ప్రత్యేక వివాహ చట్టం 1954 ప్రకారం “వివాహం” అనే పదాన్ని “పురుషులు, స్త్రీ” అని కాకుండా “జీవిత భాగస్వామి” మధ్య అని చదవాలని పిటిషనర్లు సుప్రీం కోర్టును కోరారు. ప్రత్యేక వివాహ చట్టం కింద స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపు అంశానికే పరిమితమవుతామని, వ్యక్తిగత చట్టాలకు సంబంధించిన అంశాల జోలికి వెళ్లబోమని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా స్వలింగ సంపర్క జంటలకు చట్టబద్ధత కల్పించే అంశంలోకి వెళ్లకుండా, వారి ఆందోళనలను పరిష్కరించడం కోసం కొన్ని చర్యలను అన్వేషించడానికి కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం మే 3న సుప్రీంకోర్టుకు తెలిపింది.

Updated Date - 2023-10-17T09:21:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising