NRI: ఇద్దరు భారతీయుల సరికొత్త గిన్నిస్ రికార్డ్.. కేవలం 3 రోజుల్లో..

ABN , First Publish Date - 2023-01-10T17:49:45+05:30 IST

మరో గిన్నిస్ రికార్డ్ భారతీయుల సొంతమైంది. డా. అలీ ఇరానీ, సుజయ్ కుమార్ మిత్రా.. భూమ్మీదున్న 7 ఖండాలను 73 గంటల్లోనే చుట్టొచ్చి సరికొత్త రికార్డు నెలకొల్పారు

NRI: ఇద్దరు భారతీయుల సరికొత్త గిన్నిస్ రికార్డ్.. కేవలం 3 రోజుల్లో..

ఎన్నారై డెస్క్: మరో గిన్నిస్ రికార్డ్ భారతీయుల సొంతమైంది. డా. అలీ ఇరానీ, సుజయ్ కుమార్ మిత్రా.. భూమ్మీదున్న 7 ఖండాలను 73 గంటల్లోనే చుట్టొచ్చి సరికొత్త రికార్డు నెలకొల్పారు. అతి తక్కువ సమయంలో అన్ని ఖండాల్లో పర్యటించిన వారిని గిన్నిస్ రికార్డ్ వరించింది. అరుదైన రికార్డ్ నెలకొల్పడంపై ఇరువురూ హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఈ రోజు మేము ఓ రికార్డు బద్దలు కొట్టి ఉండొచ్చు. కానీ.. రేపు ఇంకొకరు మా రికార్డ్‌ను అధిగమిస్తారు’’ అంటూ వారిద్దరూ వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఏ రికార్డైనా అధిగమించొచ్చనేది తమ నమ్మకమని వారు చెప్పారు. పర్యటనలంటే ఇష్టపడే అలీ, సుజయ్..కేవలం మూడు రోజుల్లోనే ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఓషియానాలను చుట్టొచ్చేశారు. గతేడాది డిసెంబర్ 4న అంటార్కిటికాలో మొదలైన వారి పర్యటన డిసెంబర్ 7న ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌ నగరంలో ముగిసింది. తమ గిన్నిస్ రికార్డను డా.అలీ ఇన్‌స్టాలో షేర్ చేశారు.

Updated Date - 2023-01-10T18:08:15+05:30 IST