ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CBN Enquiry: తొలి రోజు ముగిసిన సీఐడీ విచారణ.. చంద్రబాబును మొత్తం ఎన్ని ప్రశ్నలు అడిగారంటే..?

ABN, First Publish Date - 2023-09-23T18:08:57+05:30

విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబును రెండు రోజుల కస్టడీలోకి తీసుకున్న సీఐడీ అధికారులు శనివారం నాడు తొలిరోజు న్యాయవాదుల సమక్షంలో విచారించారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు తొలిరోజు కస్టడీ ముగిసింది. విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబును రెండు రోజుల కస్టడీలోకి తీసుకున్న సీఐడీ అధికారులు శనివారం నాడు తొలిరోజు న్యాయవాదుల సమక్షంలో విచారించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులోని కాన్ఫరెన్స్ హాలులో కీలక ఫైళ్లను చంద్రబాబు ముందు ఉంచి ఈ విచారణ చేపట్టారు. సుమారు ఆరు గంటల పాటు ఈ విచారణ సాగినట్లు తెలుస్తోంది. ఉదయం 9:30 గంటలకు సెంట్రల్ జైలుకు వచ్చిన అధికారులు.. ఉదయం 11:30 గంటలకు విచారణ ప్రారంభించారు. ఉద్దేశపూర్వకంగానే విచారణలో జాప్యం చేశారని చంద్రబాబు తరఫు లాయర్లు ఆరోపిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం విచారణ ప్రక్రియను మొదలుపెట్టారు.

ఇది కూడా చదవండి: NCBN Arrest : ఢిల్లీలో చినబాబు.. ఏపీలో బాలయ్య బాబు ఇద్దరి టార్గెట్ ఒక్కటే.. వణికిపోతున్న వైసీపీ!

మధ్యాహ్నం ఒంటి గంటకు చంద్రబాబుకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఈ లంచ్ బ్రేక్ గంట ఇచ్చినట్లు సమాచారం. లంచ్ బ్రేక్ తర్వాత కూడా చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించారు. ప్రధానంగా చంద్రబాబుకు సీఐడీ అధికారుల బృందం 50 ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. మొత్తం సీఐడీ బృందం 120 ప్రశ్నలతో వెళ్లిందని.. అయితే ఇందులో 50 ప్రశ్నలు మాత్రమే అడిగినట్లు టాక్ నడుస్తోంది. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టును రూ.3,300 కోట్ల ప్రాజెక్టుగా ఎలా నిర్ణయించారు?, సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ పేరుతో జీవో ఎలా ఇచ్చారు అంటూ ప్రశ్నించినట్లు సీఐడీ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ కేసులో తన ప్రమేయం లేదని సీఐడీ అధికారులకు చంద్రబాబు స్పష్టం చేసినట్లు సమాచారం. కాగా చంద్రబాబు విచారణలో 9 మంది సీఐడీ అధికారులు పాల్గొన్నారు. సీఐడీ అధికారులతో పాటు ఇద్దరు మీడియేటర్లు, ఒక వీడియో గ్రాఫర్ ఉన్నారు. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు ఆధ్వర్యంలో ఈ విచారణ సాగింది. విచారణ సమయంలో చంద్రబాబు తన న్యాయవాదితో మాట్లాడుకునే వెసులుబాటు కల్పించారట. ఆదివారం నాడు ఈ కేసుకు సంబంధించి రెండోరోజు విచారణ జరగనుంది. ఏసీబీ కోర్టు తీర్పు ప్రకారం చంద్రబాబు చెప్పిన సమాధానాలు రికార్డు చేసి సీఐడీ అధికారులు ధర్మాసనానికి సమర్పించాల్సి ఉంటుంది.

Updated Date - 2023-09-23T18:20:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising