ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Crime news: పుట్టిన రోజున తల్లి, ఆమె ప్రియుడితో కలిసి అర్ధరాత్రి కేక్ కట్ చేసిన బాలిక.. ఉదయం స్థానికులు వెళ్లి చూడగా షాకింగ్ సీన్..

ABN, First Publish Date - 2023-10-26T22:06:26+05:30

పెద్దలు తెలిసి తెలిసి చేసే తప్పులు కొన్నిసార్లు పిల్లల ప్రాణాల మీదకు వస్తుంటాయి. ప్రధానంగా ప్రేమ, వివాహేతర సంబంధాల విషయంలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా తలెత్తుతుంటాయి. పిల్లలు ఉన్న తల్లిదండ్రులు కూడా తప్పటడుగులు వేస్తూ.. చివరకు...

ప్రతీకాత్మక చిత్రం

పెద్దలు తెలిసి తెలిసి చేసే తప్పులు కొన్నిసార్లు పిల్లల ప్రాణాల మీదకు వస్తుంటాయి. ప్రధానంగా ప్రేమ, వివాహేతర సంబంధాల విషయంలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా తలెత్తుతుంటాయి. పిల్లలు ఉన్న తల్లిదండ్రులు కూడా తప్పటడుగులు వేస్తూ.. చివరకు వారు ఇబ్బందుల్లో పడడమే కాకుండా వారి పిల్లలకూ సమస్యలు తెచ్చిపెట్టడం చూస్తూ ఉన్నాం. తాజాగా, బీహార్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ బాలిక తన పుట్టిన రోజు కావడంతో అర్ధరాత్రి సమయంలో తల్లి, ఆమె ప్రియుడితో కలిసి కేక్ కట్ చేసింది. అయితే ఉదయం స్థానికులు వెళ్లి చూడగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...

బీహార్ (Bihar) గోపాల్‌గంజ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక సాధుచౌక్ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు అఫ్సానా ఖాతూన్ (15) అనే కూతురు ఉంది. ఈమె ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతోంది. ఇదిలావుండగా బుధవారం ఆమె పుట్టిన రోజు (birthday) కావడంతో పాఠశాలలో అందరికీ స్వీట్లు పంచి వచ్చింది. రాత్రి ఇంటి చుట్టు పక్కల వారికీ స్వీట్లు (Sweets) పంచింది. అర్ధరాత్రి తల్లి, ఆమె ప్రియుడు పంకజ్ కుమార్‌తో పాటూ కేక్ కట్ చేసింది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో గానీ.. ఉదయం స్థానికులు అటుగా వెళ్లి చూడగా.. (girl Suspicious death) బాలిక ఉరికి వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు.

Viral Video: దాదాపు సగం చచ్చిపోయిన పామును చూసిన పోలీసు.. చివరకు ఒకే ఒక్క పని చేసి ఎలా బతికించాడంటే..

బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే మృతురాలి అత్త మాట్లాడుతూ బాలిక తల్లి ప్రియుడే ఈ హత్య చేశాడని ఆరోపించింది. చంపిన తర్వాత అనుమానం రాకుండా ఉరికి వేలాడదీశారని చెప్పింది. ఇదిలావుండగా, ఈ ఘటన జరిగిన మరుసటి రోజు నుంచి పంకజ్ కుమార్ పరారీలో ఉండడంతో పోలీసుల అనుమానం బలపడింది. నిందితుడు కొన్నాళ్లుగా బాలిక తల్లితో కలిసి ఉంటున్నాడని విచారణలో తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని, పూర్తి విచారణ అనంతరం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Viral News: పోలీసుల వద్దకు ఏడుస్తూ వచ్చిన 7 ఏళ్ల పిల్లాడు.. ఏమైందని అడిగితే ఆ బాలుడు చెప్పింది విని షాక్.. చివరకు ఊహించని ట్విస్ట్..!

Updated Date - 2023-10-26T22:07:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising