ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Wife: బంధువుల ఇంటికి వెళ్తున్నట్టు భార్యకు చెప్పి.. సీక్రెట్‌గా ఇంటికి తిరిగొచ్చిన భర్త.. తెల్లారేసరికి ఊరంతా ఉలిక్కిపడే ఘటన..

ABN, First Publish Date - 2023-11-08T14:11:49+05:30

పంజాబ్‌లోని లూథియానా (Ludhiana) లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. బంధువుల ఇంటికి వెళ్తున్నట్టు భార్యకు చెప్పి వెళ్లిన భర్త.. సీక్రెట్‌గా ఇంటికి తిరిగొచ్చి చేసిన ఘాతుకం తెల్లారేసరికి ఊరంతా ఉలిక్కిపడేలా చేసింది.

Wife: పంజాబ్‌లోని లూథియానా (Ludhiana) లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. బంధువుల ఇంటికి వెళ్తున్నట్టు భార్యకు చెప్పి వెళ్లిన భర్త.. సీక్రెట్‌గా ఇంటికి తిరిగొచ్చి చేసిన ఘాతుకం తెల్లారేసరికి ఊరంతా ఉలిక్కిపడేలా చేసింది. మూడో కంటికి తెలియకుండా అర్ధరాత్రి ఇంటికి తిరిగొచ్చిన భర్త అంతే సీక్రెట్‌గా భార్య గొంతుకోసి చంపేసి తిరిగి ఊరెళ్లిపోయాడు. తీరా.. కొడుకు ఫోన్ చేసి అమ్మ చనిపోయిందని చెప్పడంతో తిరిగి ఇంటికి వచ్చాడు. అక్కడ అందరిముందు ఏడుపు నటించాడు కూడా. కానీ, అతని ప్రవర్తనపై అనుమానంతో పోలీసులు విచారించడం వల్ల అసలు నిజం బయటపడింది.

Wife: నెలల తరబడి ఇంటికి రాని భర్త.. ఒకరికి ముగ్గురిని పెళ్లి చేసుకున్న భార్య.. ఆమె నిర్వాకం అసలెలా బయటపడిందంటే..!


అసలేం జరిగిందంటే..

లూథియానా పరిధిలోని బహమెయిన్ రోడ్‌కు చెందిన దద్వాల్ కుమార్‌కు అదే ప్రాంతానికి చెందిన పూజాతో వివాహమైంది. వీరికి ఐదేళ్ల ఇద్దరు కవలలు ఉన్నారు. అయితే, దద్వాల్‌కు పూజా కంటే ముందు ఓ మహిళతో పెళ్లైంది. కానీ, ఆమె అనారోగ్యంతో చనిపోయింది. దాంతో పూజాను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక మొదటి భార్యతో దద్వాల్‌కు ఇద్దరు సంతానం ఉన్నారు. 14 ఏళ్ల కొడుకు, 8 ఏళ్ల కూతురు. కుమార్తె అమ్మమ్మ ఇంట్లోనే ఉంటుంది. కుమారుడు మాత్రం దద్వాల్ వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో పూజా కొన్నిరోజులుగా తన కుమారుడిని వేధించడం తెలుసుకున్న దద్వాల్ ఆమెను మందలించాడు. కానీ, ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. దాంతో పూజాను ఎలాగైనా అంతమొందించాలనుకున్నాడు. దీనికోసం మాస్టర్ ప్లాన్ వేశాడు. గత ఆదివారం బంధువుల అబ్బాయికి బాగాలేదని ఫగ్వారా వెళ్తున్నానని పూజాతో చెప్పి వెళ్లాడు దద్వాల్. కానీ, అదే రోజు రాత్రి మూడో కంటికి తెలియకుండా తిరిగి లూథియానాకు వచ్చాడు. ఆ తర్వాత సీక్రెట్‌గా తన ఇంటికి చేరుకున్నాడు. పిల్లలందరూ నిద్రపోతున్నారు. పూజా కూడా మంచి నిద్రలో ఉంది. అదే అదునుగా భావించిన దద్వాల్ తనతో పాటు తెచ్చుకున్న పేపర్ కట్టింగ్ బ్లేడ్‌తో నిద్రపోతున్న పూజా గొంతుకోసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ రాత్రే తిరిగి ఫగ్వారా వెళ్లిపోయాడు.

Shocking: 28 ఏళ్ల కుర్రాడికి వింత కష్టం.. మహిళా పోలీస్ స్టేషన్‌ ముందే ఆత్మహత్యకు యత్నం.. అసలెందుకిలా చేశాడో తెలిసి..!

ఇక తెల్లవారుజామున దద్వాల్ పెద్ద కుమారుడు నిద్రలేచి చూసేసరికి పూజా రక్తపుమడుగులో పడి ఉంది. దాంతో భయపడిపోయిన బాలుడు వెంటనే విషయాన్ని చుట్టుపక్కలవారికి తెలియజేశాడు. ఆ తర్వాత దద్వాల్‌కు ఫోన్ చేసి చెప్పాడు. ఇక కుమారుడు ఫోన్ చేసిన వెంటనే దద్వాల్ తనకేమి తెలియనట్టుగా ఇంటికి చేరుకున్నాడు. అందరిముందు ఏడుపు నటించాడు. అప్పటికే ఈ హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు దద్వాల్ ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో అతణ్ని విచారించారు. కానీ, వారు అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దాంతో పోలీసులకు దద్వాల్ కుమార్‌పై అనుమానం కలిగింది. వెంటనే అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారించడంతో నిజం చెప్పేశాడు. తన కుమారుడిని వేధింపులకు గురిచేయడంతో తన భార్యను తానే గొంతుకోసి చంపేసినట్లు అంగీకరించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Chicken Biryani: చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇస్తే.. పీస్‌లకు బదులుగా కోడి తలను చూసి అవాక్కైన మహిళ.. ఆ తర్వాత ఏం చేసిందంటే..!

Updated Date - 2023-11-08T14:11:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising