ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shocking News: పాపం.. ఓ వ్యక్తి తన మానాన తాను కూలి పని చేస్తోంటే.. వెంటాడుతూ వచ్చిన మృత్యువు.. అక్కడికక్కడే ఎలా చనిపోయాడంటే..!

ABN, First Publish Date - 2023-04-29T20:16:48+05:30

మృత్యువు ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. అప్పటి వరకూ బాగున్న వారు.. ఆ మరుక్షణంలోనే విగతజీవులుగా మారిపోతుంటారు. కొన్నిసార్లు మన మానాన మనం వెళ్తున్నా.. మృత్యువు ఏదో ఒక రూపంలో వచ్చి ..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మృత్యువు ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. అప్పటి వరకూ బాగున్న వారు.. ఆ మరుక్షణంలోనే విగతజీవులుగా మారిపోతుంటారు. కొన్నిసార్లు మన మానాన మనం వెళ్తున్నా.. మృత్యువు ఏదో ఒక రూపంలో వచ్చి అమాంతం కబళించేస్తుంటుంది. ఇలాంటి ఘటనలకు సబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తరచూ దర్శనమిస్తుంటాయి. ప్రస్తుతం ఇలాంటి విషాదకర వార్త ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి తన మానాన తాను పని చేస్తుంటే.. మృత్యువు వెంటాడుతూ వచ్చింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఘజియాబాద్ పరిధి ఇందిరాపురంలోని కనవాని ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బీహార్ (Bihar) పూర్నియా ప్రాంతానికి చెందిన అసద్ (22) అనే వ్యక్తి కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడు. ఈ క్రమంలో ఉపాధి నిమిత్తం కనవాని ప్రాంతానికి వచ్చాడు. ఇక్కడ నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద (building under construction) పని చేస్తున్నాడు. ఇదిలావుండగా, గురువారం రాత్రి ఈ ప్రాంతంలో తీవ్ర తుఫాను (storm) వచ్చింది. ఆ సమయంలో పనిలో ఉన్న కూలీలు.. విషయం తెలుసుకుని ముందే ఎవరి ఇళ్లకు వారు వెళ్లారు.

Viral news: చదువుకున్న బ్యాచ్‌లర్స్ కదా అని ఇల్లు అద్దెకిస్తే.. ఎంత పని చేశారో చూడండంటూ ఫొటోలను బయటపెట్టిన యజమాని..

అయితే అసద్ మాత్రం భవనం వద్దే ఉండిపోయాడు. కాసేపటి తుఫానుతో పాటూ బలమైన గాలులు వీచాయి. ఈ క్రమంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. భవనం పైన ఉన్న పెద్ద ఇనుప రాడ్డు.. గాలుల దాటికి కింద ఉన్న అసద్‌పై పడింది. మెడలో గుచ్చుకోవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం అతడి కుటుంబ సభ్యులను పిలిపించి, మృతదేహాన్ని అప్పగించారు. ఈ ఘటనపై మృతుడి బంధువులు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Viral Video: బల్లి కరిస్తే ఏమవుతుంది..? ఈ కుర్రాడి చెవికి చివరకు ఏమైంది..?

Updated Date - 2023-04-29T20:16:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising