ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: 47 ఏళ్ల ఆ మహిళ చనిపోయి రెండేళ్లవుతోంది.. సడన్‌గా పోలీసులు ఇప్పుడు ఆమెపై కేసు పెట్టడం వెనుక..!

ABN, First Publish Date - 2023-07-13T20:23:45+05:30

హత్యలు, ఆత్మహత్యలకు సంబంధించిన కేసుల్లో కొన్నిసార్లు పోలీసులు కూడా అవాక్కయ్యేలా ట్విస్టులు చోటు చేసుకుంటుంటాయి. కేసుల నుంచి తప్పించుకునేందుకు నిందితులు.. పక్కాగా పథకం రచిస్తుంటారు. అలాగే మరికొన్ని ఘటనల్లో పోలీసులు నమోదు చేసే కేసులు కూడా..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హత్యలు, ఆత్మహత్యలకు సంబంధించిన కేసుల్లో కొన్నిసార్లు పోలీసులు కూడా అవాక్కయ్యేలా ట్విస్టులు చోటు చేసుకుంటుంటాయి. కేసుల నుంచి తప్పించుకునేందుకు నిందితులు.. పక్కాగా పథకం రచిస్తుంటారు. అలాగే మరికొన్ని ఘటనల్లో పోలీసులు నమోదు చేసే కేసులు కూడా చిత్రవిచిత్రంగా ఉంటాయి. అలాంటి విచిత్రమైన కేసుకు సంబంధించిన వార్త ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 47 ఏళ్ల ఓ మహిళ చనిపోయి రెండేళ్లవుతోంది. అయితే పోలీసులు సడన్‌గా ఆమెపై కేసులు నమోదు చేశారు. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ముంబై (Mumbai) శివారు ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక నయానగర్ ప్రాంతానికి చెందిన నస్రీన్ (47) అనే మహిళ (woman) .. పిల్లలు సద్నాజ్ (20), హర్ష్ (13) తో కలిసి జీవనం సాగిస్తూ ఉండేది. అయితే ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ 2021 సెప్టెంబర్ 7న ఇంట్లో శవాలై కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం (Postmortem) నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే పోస్టుమార్టం నివేదికలో సంచలన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

Viral: స్వర్గంలో అయిదేళ్లు ఉండి వచ్చా.. అక్కడంతా ఎలా ఉందంటే.. నివ్వెరపోయేలా చేస్తున్న ఓ మహిళ వీడియో..!

నస్రీన్ తన పిల్లల గొంతు కోసి హత్య చేసి, తర్వాత తానూ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుందని తేలింది. శవ పరీక్షల నివేదికల ఆధారంగా మంగళవారం పోలీసులు.. చనిపోయిన నస్రీన్‌పై హత్యానేరం కింద కేసులు నమోదు చేశారు. అయితే మహిళ తన పిల్లలను చంపడమే కాకుండా తానూ ఆత్మహత్య చేసుకోవడం వెనుక గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం విచారణ చేస్తున్నామని, త్వరలో ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో (Viral news) తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video: దుండగుడు బ్యాగు లాక్కోవడంతో.. పోతేపోనీ అని వదిలేసిన మహిళ.. అయితే ఇలా జరుగుతుందని ఇద్దరూ ఊహించలేదు..

Updated Date - 2023-07-13T20:23:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising