ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Wife: పెళ్లయిన 15వ రోజే పోలీస్ స్టేషన్లో నవ వధువు.. భర్త గురించి చెప్పిన నిజాలు విని విస్తుపోయిన పోలీసులు.. చివరకు..!

ABN, First Publish Date - 2023-08-08T16:33:09+05:30

వివాహమైన తర్వాత ఏ జంట అయినా హనీమూన్ ప్లాన్ చేసుకుంటుంది. సరదా సరదాగా గడుపుతూ దాంపత్య జీవితంలోని ప్రారంభ రోజులను ఎంజాయ్ చేస్తారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే నూతన జంట విషయంలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. వివాహమైన 15వ రోజే ఓ నవ వధువు...

వివాహమైన తర్వాత ఏ జంట అయినా హనీమూన్ ప్లాన్ చేసుకుంటుంది. సరదా సరదాగా గడుపుతూ దాంపత్య జీవితంలోని ప్రారంభ రోజులను ఎంజాయ్ చేస్తారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే నూతన జంట విషయంలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. వివాహమైన 15వ రోజే ఓ నవ వధువు పోలీస్ స్టేషన్‌కి వెళ్లింది. భర్త గురించి ఆమె చెప్పిన నిజాలు విని పోలీసులు కూడా విస్తుపోయారు. చివరకు ఏం జరిగిదంటే..

బీహార్ (Bihar) భాగల్పూర్ సబూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల సాక్షి ప్రియకు.. ఇదే ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల దిల్‌ఖుష్ కుమార్ అలియాస్ బీర్బల్‌తో 2022 నవంబర్‌లో వివాహమైంది. అనంతరం వధువు (bride) ఎన్నో ఆశలతో అత్తారింట్లోకి అడుగు పెట్టింది. అయితే 15 రోజులు కూడా గడవకముందే.. ఆమె ఆశలన్నీ అడియాశలయ్యాయి. భర్తకు ఇదే ప్రాంతానికి చెందిన ఓ వివాహితతో 8ఏళ్లుగా వివాహేతర సంబంధం (extramarital affair) ఉందనే విషయం తెలిసింది. అయితే మొదట్లో ఆమె నమ్మకపోయినా.. రాను రాను అనుమానం మరింత బలపడింది.

Viral Video: కోతితో స్నేహం చేసిన కప్ప.. మరో కోతి దగ్గరికి రాగానే ఎలా రియాక్షన్ ఇచ్చిందో చూడండి..

ఈ క్రమంలో కొన్ని రోజులకు ప్రియురాలితో ఉన్న భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. దీంతో భార్యపై అతను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతటితో ఆగకుండా ఆమెపై విచక్షణారహితంగా (Assault on wife) దాడి చేసి, ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు భర్త నిర్వాకంపై ఫిర్యాదు చేసింది. అయితే అతడిపై చర్యలు తీసుకోవడంలో మాత్రం పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ ఇటీవల ఎస్పీ కార్యాలయానికి చేరుకుంది. ఆమె సమస్యను విన్న ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతోంది.

Woman: ఆస్పత్రికి వచ్చిన 25 ఏళ్ల యువతి.. ఓ బాలింత గదిలోకి వెళ్లడంతో నర్సులకు డౌట్.. లోపలికి వెళ్లి చూస్తే..!

Updated Date - 2023-08-08T16:33:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising