ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Wife: చెట్ల పొదల్లో ఓ వ్యక్తి మృతదేహం.. హత్యేనని తేల్చేసిన పోలీసులు.. భార్యను విచారిస్తే వెలుగులోకి విస్తుపోయే నిజాలు..!

ABN, First Publish Date - 2023-09-19T19:17:48+05:30

ఆమెకు అప్పటికే రెండుసార్లు వివాహమైంది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా ఆ ఇద్దరు భర్తలనూ వదిలేసి మూడో వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈసారైనా వీరి సంసారం సవ్యంగా సాగుతుందేమో అని అంతా అనుకున్నారు. అయితే తాజాగా, ఉన్నట్లుండి మూడో భర్త.. చెట్ల పొదల్లో...

ప్రతీకాత్మక చిత్రం

ఆమెకు అప్పటికే రెండుసార్లు వివాహమైంది. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా ఆ ఇద్దరు భర్తలనూ వదిలేసి మూడో వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈసారైనా వీరి సంసారం సవ్యంగా సాగుతుందేమో అని అంతా అనుకున్నారు. అయితే తాజాగా, ఉన్నట్లుండి మూడో భర్త.. చెట్ల పొదల్లో శవమై కనిపించాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఎవరో అతన్ని హత్య చేసినట్లు గుర్తించారు. అయితే చివరకు మృతుడి భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే...

బీహార్ రాజధాని పాట్నా (Bihar Patna) సమీపంలోని ఫుల్వారీ షరీఫ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన అస్మారీ ఖాటూన్ అనే మహిళకు (woman) యూపీకి చెందిన సుభాష్ ప్రజాపతి అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితం (marriage) వివాహమైంది. అస్మారీకి అప్పటికే రెండు వివాహాలు అయ్యాయి. మొదటి, రెండో భర్తను నుంచి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మూడో భర్తగా (Third husband) సుభాష్ ప్రజాపతిని వివాహం చేసుకున్న అస్మారీ.. సవ్యంగా ఉండాల్సింది పోయి, అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. సుభాష్‌ ఆస్తిని తన పేరు మీద మార్చాలని తరచూ గొడవ చేస్తూ ఉండేది.

Hostel Girls: రాత్రి 10 గంటల సమయం.. సడన్‌గా పోలీస్ స్టేషన్‌‌కు వచ్చిన 60 మంది బాలికలు.. ఏడుస్తూ వాళ్లంతా చెప్పింది విని..!

ఈ విషయంలో దంపతుల మధ్య (Dispute over property) తరచూ గొడవలు జరుగుతుండేవి. తాజాగా, రెండు రోజుల కిందట కూడా వీరి మధ్య గొడవ జరిగింది. అయితే తర్వాత అస్మారీ సంచలన నిర్ణయం తీసుకుంది. తల్లితండ్రులతో కలిసి భర్తను చంపేయాలని కుట్ర పన్నింది. పథకం ప్రకారం అంతా కలిసి ప్రజాపతిపై మూకుమ్మడిగా దాడి చేసి, గొంతు కోసి హత్య చేశారు. తర్వాత మృతదేహాన్ని స్థానికంగా నిర్మానుష్య ప్రదేశంలో పడేశారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చివరికి మృతుడి భార్య, అత్తమామలపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం అంగీకరించడంతో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలుకు తరలించారు. ఇదిలావుండగా, మూడో భర్తను చంపిన ఆమె.. మళ్లీ నాలుగో పెళ్లికి సిద్ధపడుతున్నట్లు విచారణలో తేలింది. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Panipuri: పానీ పూరీ తిన్న వెంటనే ఈ అమ్మాయికి భరించలేనంత కడుపునొప్పి.. ఆస్పత్రిలో మృతి.. అసలేం జరిగిందంటే..!

Updated Date - 2023-09-19T19:17:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising