ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Wife: భార్య నల్లగా ఉందంటూ కరెంట్ షాకిచ్చి చంపేసిన భర్త.. ఐస్ బాక్సులో పెట్టి తప్పించుకునేందుకు స్కెచ్.. ఎలా దొరికిపోయాడంటే..!

ABN, First Publish Date - 2023-08-29T18:11:28+05:30

కూరలో ఉప్పు ఎక్కువైందని కొందరు, కాఫీలో చెక్కెర తక్కువైందని మరికొందరు.. కుటుంబ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేయడం చూస్తూ ఉంటాం. ఇంకొందరైతే ఇలాంటి చిన్న చిన్న సమస్యలను పెద్దవిగా చేసి, భార్యలను నిత్యం వేధింపులకు గురి చేస్తుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే భర్త..

ప్రతీకాత్మక చిత్రం

కూరలో ఉప్పు ఎక్కువైందని కొందరు, కాఫీలో చెక్కెర తక్కువైందని మరికొందరు.. కుటుంబ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేయడం చూస్తూ ఉంటాం. ఇంకొందరైతే ఇలాంటి చిన్న చిన్న సమస్యలను పెద్దవిగా చేసి, భార్యలను నిత్యం వేధింపులకు గురి చేస్తుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే భర్త చేసిన దారుణం చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భార్య నల్లగా ఉందంటూ కరెంట్ షాకిచ్చి చంపేశాడు. మృతదేహాన్ని ఐస్ బాక్సులో పెట్టి తప్పించుకునేందుకు స్కెచ్ వేశాడు. చివరకు ఏం జరిగిందంటే..

బీహార్ (Bihar) తూర్పు చంపారన్ జిల్లా చతౌని ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక సంగ్రామ్‌పూర్ పురందర్‌పూర్ గ్రామానికి చెందిన శ్యామ్‌లాల్ అనే వ్యక్తికి ప్రియాంక దేవి (23) అనే భార్య ఉంది. శ్యామ్ కొన్ని నెలలుగా బడాబరియాపూర్ ప్రాంతంలోని ఐస్ ఫ్యాక్టరీలో (Ice Factory) పని చేస్తున్నాడు. దీంతో తన భార్యతో కలిసి అదే ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఇదిలావుండగా, వివాహమైనప్పటి నుంచి ఈ దంపతుల మధ్య తరచూ గొడవలు (Quarrels between couples) జరుగుతుండేవి. ‘‘నువ్వు నల్లగా ఉన్నావ్.. అనవసరంగా వివాహం చేసుకున్నా’’.. అంటూ తరచూ భార్యతో గొడవపడుతుండేవాడు. ఇటీవల ఈ గొడవలు ఇంకా ఎక్కువయ్యాయి. అయినా ఆమె తన సమస్యను ఎవరికీ చెప్పుకోలేక అలాగే భరిస్తూ వచ్చింది.

Viral Video: ప్రాణభయంతో ప్రశాంతంగా తినగలరా..? లక్షలు ఇస్తామన్నా ఈ రిస్క్ చేయలేమంటున్న నెటిజన్లు..!

ఈ క్రమంలో సోమవారం కూడా దంపతుల మధ్య ఇదే విషయమై గొడవ తలెత్తింది. అయితే ఈసారి మాత్రం తీవ్ర ఆగ్రహానికి గురైన శ్యామ్.. భార్యకు కరెంట్ షాక్ (husband gave electric shock to his wife) ఇచ్చాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత కేసు తన మీదకు రాకుండా ఉండేందుకు భార్య మృతదేహాన్ని ఐస్ బాక్సులో దాచాడు. దాన్ని ఎవరికీ కనపడకుండా ఉండేలా దాచాలని ప్లాన్ వేశాడు. బాక్సును రహస్యంగా తరలిస్తుండగా.. చుట్టు పక్కల వారికి అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు శ్యామ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు శ్యామ్‌తో పాటూ అతడి తల్లిదండ్రులపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Metro Train: మెట్రో రైల్లో షాకింగ్ సీన్.. ఒక్కసారిగా అవాక్కైన ప్రయాణీకులు.. ఈ యువతులంతా ఏం చేశారో మీరే చూడండి..!

Updated Date - 2023-08-29T18:11:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising