ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Wife: కడుపునొప్పితో భార్య చనిపోయిందంటూ అత్తమామలకు ఫోన్.. వచ్చీ రాని మాటలతోనే తండ్రి దారుణాన్ని బయటపెట్టిన 6 ఏళ్ల కొడుకు..!

ABN, First Publish Date - 2023-10-27T12:58:30+05:30

సినిమా కథను తలపించే క్రైమ్ స్టోరీ (Crime Story) ఒకటి తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని బండాలో బయటపడింది. కడుపునొప్పితో భార్య చనిపోయిందంటూ అత్తమామల వద్ద బుకాయించి తప్పించుకోవాలని చూశాడో భర్త. కానీ, అతని ఆరేళ్ల కుమారుడు వచ్చీ రాని మాటలతో తండ్రి దారుణాన్ని బయటపెట్టాడు.

Banda Shocking Crime: సినిమా కథను తలపించే క్రైమ్ స్టోరీ (Crime Story) ఒకటి తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని బండాలో బయటపడింది. కడుపునొప్పితో భార్య చనిపోయిందంటూ అత్తమామల వద్ద బుకాయించి తప్పించుకోవాలని చూశాడో భర్త. కానీ, అతని ఆరేళ్ల కుమారుడు వచ్చీ రాని మాటలతో తండ్రి దారుణాన్ని బయటపెట్టాడు. మరో వ్యక్తితో కలిసి తండ్రే తన తల్లిని చంపేశాడని చెప్పడంతో స్థానికులు షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని బండా జిల్లా (Banda District) మంగస్ కా పుర్వా పరిధిలోని అలీయా గ్రామంలో శివ్ దేవీ, కిశోర్ కుమార్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ప్రేమ్ (06), అతుల్ (04) ఉన్నారు. కిశోర్ కుమార్ స్థానికంగా పిండి గిర్నీ నడిపిస్తున్నాడు. అయితే, మద్యానికి బానిస అయిన కిశోర్ తరచూ భార్యతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఈ నెల 24న మద్యం మత్తులో ఉన్న అతడు మరోసారి శివ్ దేవీతో ఘర్షణకు దిగాడు. చాలాసేపు భార్యతో గొడవపడిన కిశోర్ ఆ తర్వాత బయటకి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత మరో వ్యక్తితో కలిసి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇద్దరు కుమారులు ఇంట్లోనే ఉన్నారు. వారికి కిశోర్‌తో పాటు వచ్చిన ఆ వ్యక్తి చాక్లెట్ కొనుక్కోండి అని చిల్లర ఇచ్చి ఇంటి నుంచి బయటకు పంపించేశాడు. ఆ తర్వాత ఆ ఇద్దరు కలిసి శివ్ దేవీని బాత్రూంలోకి తీసుకెళ్లారు. అక్కడ గొంతు నులిమి (Strangulated ) చంపేశారు. ఆ తర్వాత కిశోర్ తన అత్తమామలకు శివ్ దేవీ కడుపునొప్పితో చనిపోయిందంటూ ఫోన్ చేశాడు.

Shocking: చెవుల్లో పదే పదే ఏదో వెరైటీ శబ్దం.. 4 రోజుల తర్వాత డాక్టర్ దగ్గరకు వెళ్లిన తర్వాత ఆమెకు మైండ్‌బ్లాక్.. ఆస్పత్రిలో చెప్పింది విని..!

అయితే, పిల్లలు అప్పటికే వారు చేసిన పనిని చూసేశారు. అల్లుడి ఫోన్‌కాల్‌తో అత్తమామలు, బంధువులు వెంటనే వారి ఇంటికి వచ్చారు. అప్పటికే ఆమె మృతదేహం బాత్రూంలో పడి ఉంది. పిల్లలు ఇద్దరు బోరున ఏడుస్తున్నారు. వారిని ఓ బంధువు దగ్గరికి తీసుకుని ఓద్చారు. ఆ సమయంలో ఆరేళ్ల ప్రేమ్ తన తండ్రి ఘాతుకాన్ని బంధువుతో చెప్పాడు. దాంతో ఆ బంధువు అక్కడ గుమ్మిగూడిన జనం అందరి ముందు శివ్ దేవీని చంపింది కిశోరే అనే విషయాన్ని ప్రేమ్‌తో చెప్పించాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బంధువుల సమాచారంతో అక్కడికి వచ్చిన పోలీసులు కిశోర్‌తో పాటు అతనికి సహకరించిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి నెట్టారు.

Shocking: ప్రపంచంలోనే అరుదైన సంఘటన.. బ్యాటరీల సాయంతో బతుకుతున్న 30 ఏళ్ల మహిళ.. అదేంటని అవాక్కవుతున్నారా..?


Updated Date - 2023-10-27T12:58:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising