ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Metro Train: మెట్రో రైల్లో సరదాగా మాట్లాడుకుంటున్న ఫ్రెండ్స్.. సడన్‌గా వాళ్ల వద్దకు వచ్చిందో మహిళ.. ఆమె చెప్పింది విని..!

ABN, First Publish Date - 2023-08-12T15:27:17+05:30

ఇటీవల మెట్రో రైళ్లలో చోటు చేసుకునే చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన విడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మహిళలు సీటు కోసం గొడవ పడడం, రద్దీ మధ్య తోసుకుంటూ, తొక్కుకుంటూ ఎక్కడం, డోరు వద్ద ప్రమాదకరంగా వేలాడుతూ ప్రయాణం చేయడం.. వంటి ఘటనలు నిత్యం...

ప్రతీకాత్మక చిత్రం

ఇటీవల మెట్రో రైళ్లలో చోటు చేసుకునే చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన విడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మహిళలు సీటు కోసం గొడవ పడడం, రద్దీ మధ్య తోసుకుంటూ, తొక్కుకుంటూ ఎక్కడం, డోరు వద్ద ప్రమాదకరంగా వేలాడుతూ ప్రయాణం చేయడం.. వంటి ఘటనలు నిత్యం సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. ఇక ముంబై మెట్రో రైల్లో ఎలాంటి రద్దీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, హైదరబాద్ మెట్రో రైల్లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కొందరు స్నేహితులు మెట్రో రైల్లో సరదాగా మాట్లాడుకుంటుండగా.. సడన్‌గా ఓ మహిళ వాళ్ల వద్దకు వచ్చింది. చివరకు ఏం జరిగిందంటే..

ఓ వ్యక్తి సోషల్ మీడియాలో తనకు హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) రైల్లో ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ పోస్టు పెట్టాడు. అతడి పోస్టు ప్రకారం.. నలుగురు కుర్రాళ్లు కలిసి మెట్రో రైల్లో వెళ్తుండగా.. వారిలో ఓ వ్యక్తికి విపరీతమైన ఆకలి వేసింది. అయితే బయటి ఫుడ్‌ను రైల్లోకి తీసుకెళ్లేందుకు అనుమతి లేకపోవడంతో అతను ఆకలితో అలాగే కూర్చుని ఉన్నాడు. ఈ విషయం గురించి వారంతా మాట్లాడుకుంటుండగా.. ఓ మహిళ (woman) సడన్‌గా వారి వద్దకు వచ్చింది. ‘‘ఏంటీ.. ఆకలిగా ఉందా’’.. అని అడగడంతో యువకులంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. తర్వాత ఆమె తనతో పాటూ తెచ్చుకున్న పులిహోరను (Pulihora) వారికి పెట్టింది. అలాగే కొన్ని దానిమ్మపండ్లను కూడా ఇచ్చింది.

Viral Video: ఏ మంత్రం వేశాడేమో గానీ.. నాగు పాములను వానపాములను చేసి మరీ.. ఎలా పట్టుకున్నాడో చూడండి..

అప్పటికే ఆకలితో ఉన్నా వారు.. కానలేక వాటిని తీసుకుని కడుపు నింపుకొన్నారు. పులిహోర తిన్న తర్వాత డబ్బాను కూడా తమ వద్దే వదిలి ఆమె రైలు దిగబోయింది. ‘‘ఆడవాళ్లకు ఖాళీ డబ్బాలు ఎంత ప్రధానమో నా తల్లి ద్వారా తెలుసుకున్నాను.. అందుకే పులిహోర తిన్నాక.. ఖాళీ డబ్బాను ఆమెకు తిరిగి ఇచ్చి ధన్యవాదాలు తెలియజేశాను’’.. అని యువకుడు పేర్కొన్నాడు. కాగా, ఈ వార్త ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఆమెది ఎంత గొప్ప మనసు’’.. అంటూ కొందరు, ‘‘మానవత్వం ఇలాంటి వారి రూపంలో ఇంకా బతికే ఉంది’’.. అని మరికొందరు, ‘‘మెట్రో రైల్లోకి ఫుడ్ ఎలా అనుమతించారు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral News: జాబ్‌లో చేరిన మొదటి రోజే రిజైన్‌ లెటర్ ఇచ్చిన కుర్రాడు.. కారణం అడిగితే చెప్పిన సమాధానం విని బాస్‌కు షాక్..!

Updated Date - 2023-08-12T15:27:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising