ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Crime: ప్రియుడితో పెళ్లి కోసం ఎంతకు తెగించావమ్మా.. భార్యే కావాలంటూ వెళ్లిపోయాడని వెతుక్కుంటూ అతడికి ఇంటికెళ్లి మరీ..!

ABN, First Publish Date - 2023-08-16T19:28:05+05:30

ప్రేమ వ్యవహారాల్లో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇష్టపడిన అమ్మాయిని తన దారికి తెచ్చుకునేందుకు కొందరు, అవసరం తీరాక వదిలించుకోవడానికి మరికొందరు దారుణాలకు పాల్పడడం రోజూ ఎక్కడో చోట చూస్తూనే ఉన్నాం. అయితే కొన్నిసార్లు ఇందుకు పూర్తి విరుద్ధంగా ...

ప్రతీకాత్మక చిత్రం

ప్రేమ వ్యవహారాల్లో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇష్టపడిన అమ్మాయిని తన దారికి తెచ్చుకునేందుకు కొందరు, అవసరం తీరాక వదిలించుకోవడానికి మరికొందరు దారుణాలకు పాల్పడడం రోజూ ఎక్కడో చోట చూస్తూనే ఉన్నాం. అయితే కొన్నిసార్లు ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. తాజాగా, ఢిల్లీలో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. ప్రియుడితో పెళ్లి కోసం ఓ యువతి దారుణానికి పాల్పడింది. భార్యే కావాలంటూ వెళ్లిపోయాడని వెతుక్కుంటూ అతడి ఇంటికి వెళ్లింది. ఎవరూ లేని సమయం చూసి చివరకు ఏం చేసిందంటే..

పశ్చిమ ఢిల్లీలో (West Delhi) ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన జితేంద్ర అనే వ్యక్తికి భార్య, 11 ఏళ్ల కొడుకు ఉన్నాడు. సంతోషంగా సాగుతున్న జితేంద్ర జీవింతంలోకి మూడేళ్ల కిందట పూజ కుమారి అనే యువతి (young woman) ప్రవేశించింది. ఆమెతో ఏర్పడ్డ పరిచయం కాస్త.. కొన్నాళ్లకు వివాహేతర సంబంధానికి (extramarital affair) దారి తీసింది. దీంతో జితేంద్ర చివరకు భార్య, కొడుకును విడిచిపెట్టి 2019లో పూజ వద్దకు వెళ్లాడు. ఇద్దరూ కలిసి ఓ గది అద్దెకు తీసుకుని సహజీవనం చేశారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. మూడేళ్ల తర్వాత మళ్లీ జితేంద్ర తన భార్య వద్దకే వెళ్లాడు. ప్రియుడు ఇలా ఇంటికి వెళ్లిపోవడం పూజకు నచ్చలేదు. అప్పటి నుంచి జితేంద్ర భార్య, కొడుకుపై కోపం పెంచుకుంది.

Viral: రోడ్డు పక్కన చిన్న కాఫీ స్టాల్.. తాగేందుకు వెళ్లి.. అక్కడ ఉన్న బోర్డుపై ఏం రాసి ఉందో చదివి అవాక్కైన కస్టమర్లు..!

జితేంద్ర ఇంటి అడ్రస్ తెలుసుకున్న పూజ.. ఆగస్టు 10న ఎవరూ లేని సమయం చూసి వెళ్లింది. ఆ సమయంలో జితేంద్ర కొడుకు ఒక్కడూ మంచంపై పడుకుని ఉన్నాడు. లోపలికి వెళ్లగానే బాలుడిని ఊపిరాడకుండా (young woman killed the boy) చేసి హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని పక్కనే ఉన్న దుస్తుల పెట్టెలో దాచి పెట్టింది. ఇంటికి వచ్చిన జితేంద్ర దంపతులు కొడుకు కనిపించకపోయేసరికి మొత్తం వెతికారు. చివరకు కొడుకు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా నిందితురాలిని గుర్తించారు. మూడు రోజుల పాటు పోలీసులకు దొరక్కుండా.. అదే ప్రాంతంలో ఇళ్లు మారుతున్న ఆమెను.. ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Mother: శుభ్రం చేద్దామని 26 ఏళ్ల కొడుకు గదిలోకి వెళ్తే ఏదో పాడు వాసన.. ఏంటా అని అనుమానంతో మంచం కింద చూస్తే..!

Updated Date - 2023-08-16T19:51:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising