ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: నేను నిన్ను కలవాలంటూ.. రాత్రి 10 గంటలకు డేటింగ్ యాప్ ప్రేయసి ఫోన్.. ఇంట్లోనే మందు పార్టీ.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

ABN, First Publish Date - 2023-10-15T20:15:31+05:30

అపరిచిత వ్యక్తులతో పరిచయాలు చివరకు అనర్థాలకు కారణమవుతుంటాయి. ఈ విషయం తెలీక చాలా మంది సోషల్ మీడియా ద్వారా ఎక్కడిడెక్కడి వారితోనే పరిచయాలు పెంచుకుంటుంటారు. వీరిలో చాలా మంది అంతిమంగా చివరకు ఏదోరకంగా మోసపోతుంటారు. ఇలాంటి ఘటనలు..

ప్రతీకాత్మక చిత్రం

అపరిచిత వ్యక్తులతో పరిచయాలు చివరకు అనర్థాలకు కారణమవుతుంటాయి. ఈ విషయం తెలీక చాలా మంది సోషల్ మీడియా ద్వారా ఎక్కడిడెక్కడి వారితోనే పరిచయాలు పెంచుకుంటుంటారు. వీరిలో చాలా మంది అంతిమంగా చివరకు ఏదోరకంగా మోసపోతుంటారు. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. తాజాగా, హర్యానాలో ఇలాంటి ఘటనే జరిగింది. ‘‘నేను నిన్ను కలవాలి’’.. అంటూ ఓ యువతి తన ప్రియుడికి ఫోన్ చేసింది. తర్వాత ఇద్దరూ కలిసి అతడి ఇంట్లోనే మందు పార్టీ చేసుకున్నారు. చివరకు ఏం జరిగిందంటే..

హర్యానాలోని (Haryana) గురుగ్రామ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన రోహిత్ గుప్తా అనే వ్యక్తికి.. ఇటీవల ఓ డేటింగ్ యాప్‌లో (dating app) సాక్షి అలియాస్ పాయల్ అనే యువతితో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరూ తరచూ చాటింగ్ చేసుకునేవారు. ఈ పరిచయం చివరకు ఫోన్లు, వీడియో కాల్స్ వరకూ వెళ్లింది. తన సొంతూరు ఢిల్లీ (Delhi) అని, ప్రస్తుతం గురుగ్రామ్‌లో తన అత్త ఇంట్లో ఉంటున్నానని సదరు యువతి (young woman) చెప్పింది. ఈ క్రమంలో ఇటీవల ఓ రోజు రోహిత్‌కు ఫోన్ చేసి.. ‘‘నేను నిన్ను కలవాలి అనుకుంటున్నా’’.. అని చెప్పడంతో వెంటనే అతను ఓకే చెప్పేశాడు. రాత్రి 10గంటల ప్రాంతంలో ఆమెను స్థానిక సెక్టార్ 47లోని ఓ బారు వద్ద బైకులో ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్లాడు.

Viral Video: భార్య ప్రవర్తనకు అవాక్కయిన భర్త.. కారు డ్రైవర్‌పై రెచ్చిపోయిన మహిళ.. అంతా చూస్తుండగానే..

రాత్రి ఇద్దరూ కలిసి మందు పార్టీ చేసుకున్నారు. మధ్యలో ఐస్ ముక్కలు తెమ్మని చెప్పడంతో అతను ఫ్రిడ్జ్ వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆమె అతడి గ్లాసులో మత్తు మందు కలిపింది. తిరిగి వచ్చిన అతను మందు తాగిన కొద్దిసేపటికి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో సదరు యువతి అతడి బంగారు గొలుసు, ఐఫోన్, రూ.10వేల నగదు, క్రెడిట్, డెబిట్ కార్డులు (Theft of jewelry and cash) తీసుకుని ఉడాయించింది. అంతేగాకుండా అతడి కార్డుల నుంచి రూ.1.78లక్షలు విత్‌డ్రా చేసేసింది. మరసటి రోజు ఉదయం మెలకువలోకి వచ్చిన రోహిత్.. జరిగిన విషయం తెలుసుకుని షాక్ అయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితురాలి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Viral Video: మొదటిసారి ఎస్కలేటర్ ఎక్కిన మహిళలు.. మధ్యలోకి వెళ్లగానే.. ఒక్కసారిగా ఏమైందో చూడండి..

Updated Date - 2023-10-15T20:15:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising