ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Asia Cup: క్రికెట్ ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ధమాకా ఆఫర్! 15 రోజుల్లోనే 3 సార్లు తలపడనున్న భారత్, పాకిస్థాన్

ABN, First Publish Date - 2023-07-20T16:16:17+05:30

ఎప్పుడో ఒకసారి జరిగే భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అలాంటి అభిమానులందరికీ ట్రిపుల్ ధమాకా ఆఫర్ తగిలినట్లుగా భారత్, పాకిస్థాన్ జట్లు 15 రోజుల్లోనే ఏకంగా 3 సార్లు తలపడితే ఎలా ఉంటుంది. అభిమానులకు ఫుల్ మజా అందుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

క్రికెట్‌లో ఎన్ని హైవోల్టేజ్ మ్యాచ్‌‌లు జరిగినా భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు. భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయంటే చాలు అభిమానులంతా తమ పనులు మానుకోని మ్యాచ్‌కు అతుక్కుపోతారు. సాధారణంగా క్రికెట్ చూడని వారు సైతం భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లను వీక్షిస్తారు. దీంతో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడూ జరిగినా.. వ్యూయర్‌షిప్ పరంగా అప్పటివరకు ఉన్న రికార్డులన్నీ బద్దలై కొత్త రికార్డులు పుట్టుకొస్తాయి. పైగా భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా జరగవు. ఐసీసీ ఈవెంట్లు, ఆసియాకప్ వంటి వాటిలో మాత్రమే ఈ రెండు జట్లు తలపడతాయి. కాబట్టి ఎప్పుడో ఒకసారి జరిగే భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అలాంటి అభిమానులందరికీ ట్రిపుల్ ధమాకా ఆఫర్ తగిలినట్లుగా భారత్, పాకిస్థాన్ జట్లు 15 రోజుల్లోనే ఏకంగా 3 సార్లు తలపడితే ఎలా ఉంటుంది. అభిమానులకు ఫుల్ మజా అందుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే త్వరలోనే ఇది జరిగే అవకాశాలు ఉన్నాయి. భారత్, పాకిస్థాన్ జట్లు 15 రోజుల్లోనే 3 సార్లు తలపడే అవకాశాలున్నాయి.


ఆగష్టు 30 నుంచి ప్రారంభమయ్యే ఆసియాకప్ 2023కి బుధవారం షెడ్యూల్ విడుదలైంది. షెడ్యూల్ ప్రకారం ఆగష్టు 30 నుంచి సెప్టెంబర్ 5 వరకు గ్రూప్ దశ పోటీలు జరగనుండగా.. సెప్టెంబర్ 6 నుంచి 15 వరకు సూపర్ 4 పోటీలు జరగనున్నాయి. ఇక సెప్టంబర్ 17న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో టోర్నీ ముగుస్తుంది. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. దీంతో గ్రూపు దశ పోటీల్లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య సెప్టెంబర్ 2న మ్యాచ్ జరగనుంది. శ్రీలంకలోని కాండీ మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. రెండు జట్లు సూపర్ 4 దశకు చేరుకుంటే మరోసారి తలపడతాయి. సెప్టెంబర్ 10న కొలంబో వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు కూడా సూపర్ 4 పోటీల్లో టాప్ 2లో నిలిస్తే ఫైనల్‌లో అడుగుపెడతాయి. దీంతో భారత్, పాకిస్థాన్ జట్లు ముచ్చటగా మూడో సారి తలపడతాయి. కాగా ఈ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17న కొలంబో వేదికగా జరగనుంది. మొత్తంగా భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్ వరకు చేరుకుంటే 15 రోజుల వ్యవధిలోనే 3 సార్లు తలపడతాయి. కాగా గత ఆసియా కప్‌లోనూ ఇలాంటి అవకాశాలే ఉన్నప్పటికీ టీమిండియా ఫైనల్ చేరకపోవడంతో భారత్, పాకిస్థాన్ జట్లు రెండు సార్లే తలపడ్డాయి. కానీ ఈ సారి అలా జరగకుండా భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్ చేరాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Updated Date - 2023-07-20T16:20:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising