ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs SA: తెలుగు కుర్రాడిపై వేటు తప్పదా?.. మూడో వన్డేకు టీమిండియా ప్లేయింగ్ ఇదే!

ABN, Publish Date - Dec 21 , 2023 | 08:42 AM

India vs South africa: మొదటి రెండు వన్డేల్లో భారత్, సౌతాఫ్రికా జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. దీంతో సిరీస్ డిసైడర్ మూడో వన్డే మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటివరకు సౌతాఫ్రికా గడ్డపై భారత జట్టు ఒకే ఒకసారి వన్డే సిరీస్ గెలిచింది.

పార్ల్‌: మొదటి రెండు వన్డేల్లో భారత్, సౌతాఫ్రికా జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. దీంతో సిరీస్ డిసైడర్ మూడో వన్డే మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటివరకు సౌతాఫ్రికా గడ్డపై భారత జట్టు ఒకే ఒకసారి వన్డే సిరీస్ గెలిచింది. దీంతో మూడో వన్డేలో గెలిచి సఫారీ గడ్డపై మరోసారి సిరీస్ గెలవాలని టీమిండియా భావిస్తోంది. అయితే కీలకమైన మూడో వన్డే మ్యాచ్‌కు ముందు టీమిండియాను కీలక ఆటగాళ్ల ఫామ్ కలవరపెడుతోంది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌తోపాటు తెలుగు కుర్రాడు వన్ డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ మొదటి రెండు వన్డేల్లో విఫలమయ్యారు. పేసర్ ముఖేష్ కుమార్ మొదటి రెండు వన్డేల్లో ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో కీలకమైన మూడో వన్డేకు వీరి స్థానాల్లో మార్పులు చేసే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో సిరీస్ డిసైడర్ మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండే అవకాశాలున్నాయో ఓసారి పరిశీలిద్దాం.


అరంగేట్ర రెండు వన్డేల్లో హాఫ్ సెంచరీలు చేసిన సాయి సుదర్శన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం మొదటి రెండు వన్డే్ల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. కానీ ప్రత్యామ్నాయంగా మరో ఓపెనర్ లేకపోవడంతో గైక్వాడ్ తుది జట్టులో కొనసాగనున్నాడు. గతంలో వరుసగా భారీ ఇన్నింగ్స్‌లు ఆడి అదరగొట్టిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ప్రస్తుతం అంచనాలను అందుకోలేకపోతున్నాడు. ముఖ్యంగా నిలకడలేమితో ఇబ్బందిపడుతున్నాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌తోపాటు మొదటి రెండు వన్డేల్లో విఫలయ్యాడు. ఆస్ట్రేలియాతో ముగిసిన టీ20 సిరీస్‌లో కూడా అంతగా రాణించలేదు. దీంతో తిలక్‌ను పక్కనపెట్టి రజత్ పటిదార్‌కు తుది జట్టులో అవకాశం ఇవ్వొచ్చు. అదే జరిగితే అంతర్జాతీయ క్రికెట్‌లోకి రజత్ పటిదార్ అరంగేట్రం చేయనున్నాడు. కానీ కీలక మ్యాచ్ కావడంతో ఈ మార్పు కచ్చితంగా ఉంటుందని చెప్పలేం. నాలుగో స్థానంలో వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఆడనున్నాడు. రాకరాక అవకాశం వస్తే సంజూ రాణించలేకపోతున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లో రాణించడం అతనికి తప్పనిసరి. ఐదో స్థానంలో కెప్టెన్ కేఎల్ రాహుల్, ఆరో స్థానంలో రింకూ సింగ్ ఆడనున్నారు.

ఏడో స్థానంలో ఆల్‌ రౌండర్ అక్షర్ పటేల్ బరిలోకి దిగనున్నాడు. అక్షర్‌కు తోడుగా స్పిన్ కోటాలో కుల్దీప్ యాదవ్‌ను కొనసాగించకపోవచ్చు. అలా కాకుండా కుల్దీప్‌నకు విశ్రాంతినిచ్చి యజుర్వేంద్ర చాహల్‌ను కూడా ఆడించొచ్చు. పేసర్లుగా అర్ష్‌దీప్ సింగ్, ఆవేష్ ఖాన్ బరిలోకి దిగనున్నారు. మొదటి రెండు వన్డేల్లో వికెట్లు తీయలేకపోయినా ముఖేష్ కుమార్ స్థానంలో ఆకాష్ దీప్‌ను ఆడించే అవకాశాలున్నాయి. మొత్తంగా మూడో వన్డేకు టీమిండియా తుది జట్టులో 3 మార్పులు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.

టీమిండియా తుది జట్టు (అంచనా)

రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ/రజత్ పటిదార్, సంజూ శాంసన్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్(కెప్టెన్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్/యజుర్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ఆవేష్ ఖాన్, ముఖేష్ కుమార్/ఆకాష్ దీప్

Updated Date - Dec 21 , 2023 | 08:43 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising