TS NEWS: సింగరేణి ఎన్నికలను కార్మికులు బహిష్కరించాలి
ABN, Publish Date - Dec 22 , 2023 | 07:58 PM
సింగరేణి ఎన్నికల ( Singareni Elections )ను కార్మికులు బహిష్కరించాలని మావోయిస్టు సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా కమిటి కార్యదర్శి ప్రభాత్ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. జాతీయ కార్మిక సంఘాలతో పాటు తెలంగాణ సెంటిమెంట్తో గెలిచిన టీబీజీకేఎస్ కూడా కార్మికులను మోసం చేసిందని చెప్పారు.
మంచిర్యాల: సింగరేణి ఎన్నికల ( Singareni Elections )ను కార్మికులు బహిష్కరించాలని మావోయిస్టు సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా కమిటి కార్యదర్శి ప్రభాత్ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. జాతీయ కార్మిక సంఘాలతో పాటు తెలంగాణ సెంటిమెంట్తో గెలిచిన టీబీజీకేఎస్ కూడా కార్మికులను మోసం చేసిందని చెప్పారు. సింగరేణిలో కుంభ కోణాలు, అవినీతి, అణచి వేతలో కార్మిక సంఘాల పాత్ర కూడా ఉందని ప్రభాత్ తెలిపారు.
శ్రీరాంపూర్ లో సింగరేణి ఎన్నికల రగడ
శ్రీరాంపూర్ లో సింగరేణి ఎన్నికల రగడ నెలకొంది. ఐఎన్టీయూసీ నేతల సమావేశంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.పాత -కొత్త నాయకుల మధ్య విభేదాలు ముదిరి తీవ్ర ఘర్షణకు దారి తీశాయి. టీబీజీకేఎస్ నాయకులను చేర్చుకోవడంపై సీనియర్ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీబీజేఎస్ నుంచి వచ్చిన నేతల వల్ల ఎన్నికల్లో నష్ట పోతామని ఆందోళన వ్యక్తం చేశారు.
Updated Date - Dec 22 , 2023 | 07:58 PM