కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telangana Results: తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్న ఐదుగురు కాంగ్రెస్ అభ్యర్థులు

ABN, First Publish Date - 2023-12-03T14:27:31+05:30

Telangana Results: ఉమ్మడి నల్గొండ జిల్లాలో తొలిసారిగా ఐదుగురు కాంగ్రెస్ అభ్యర్థులు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. భువనగిరిలో కుంబం అనిల్ కుమార్ రెడ్డి, మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జునసాగర్‌లో కుందూరు జైవీర్ రెడ్డి, ఆలేరులో బీర్ల ఐలయ్య, తుంగతుర్తిలో మందుల సామెల్ అసెంబ్లీలోకి ఎంట్రీ ఇవనున్నారు. అనీల్ కుమార్ రెడ్డి మినహా కొత్త అభ్యర్ధులను కాంగ్రెస్ బరిలోకి దింపి విజయం సాధించింది.

Telangana Results: తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్న ఐదుగురు కాంగ్రెస్ అభ్యర్థులు

నల్గొండ: ఉమ్మడి నల్గొండ జిల్లాలో తొలిసారిగా ఐదుగురు కాంగ్రెస్ అభ్యర్థులు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. భువనగిరిలో కుంబం అనిల్ కుమార్ రెడ్డి, మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జునసాగర్‌లో కుందూరు జైవీర్ రెడ్డి, ఆలేరులో బీర్ల ఐలయ్య, తుంగతుర్తిలో మందుల సామెల్ అసెంబ్లీలోకి ఎంట్రీ ఇవనున్నారు. అనీల్ కుమార్ రెడ్డి మినహా కొత్త అభ్యర్ధులను కాంగ్రెస్ బరిలోకి దింపి విజయం సాధించింది. అయితే బీఆర్‌ఎస్ మాత్రం సిట్టింగ్‌లకు సీట్లు ఇచ్చి బోల్తా పడింది. మరోవైపు తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీని కనబరుస్తోంది. ఇప్పటికే 27 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా.. 41 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అలాగే అధికార బీఆర్‌ఎస్ పార్టీ 10 స్థానాల్లో విజయం సాధించగా.. 26 స్థానంలో ముందంజలో ఉంది.

Updated Date - 2023-12-03T14:27:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising