ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BJP MP Laxman: మోడీ, అమిత్ షా ఎక్కడ.. కేటీఆర్ నువ్వెక్కడ అంటూ ఫైర్..

ABN, First Publish Date - 2023-10-11T18:14:25+05:30

తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై (KTR) బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (BJP MP Laxman) ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై (KTR) బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (BJP MP Laxman) ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు వాస్తవాలు మాట్లాడుతుంటే కేటీఆర్ సంస్కారం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.


"పెద్దవారిని తిడితే పెద్దవాన్ని అవుతానని కేటీఆర్ అనుకుంటున్నారు. సీఎం కాలేదని ఫ్రస్ట్రేషన్‌లో స్థాయినీ మించి మాట్లాడుతున్నారు. వాళ్ళ కాళ్ళకింద పీఠాలు కదులుతున్నాయి. మోడీ ,అమిత్ షా ఎక్కడ కేటీఆర్ నువ్వెక్కడ. BRS వ్యతిరేక పవనాలు రాష్ట్రంలో వీస్తున్నాయి. ఒక రూపాయి ఇచ్చి 10 రూపాయలు గుంజుతున్నారు. నదులకు నడక నేర్పడం ఏమో కానీ మద్యాన్ని ఏరులై పారించారు. కేంద్ర ప్రభుత్వంకి సహకరించకుండా తెలంగాణ అభివృద్ధినీ అడ్డుకుంటున్నారు. గుజరాత్ కి వెళ్లి చూసి వస్తారు. అదే గుజరాత్ మోడల్ నీ ఎగతాళి చేస్తారు. తెలంగాణ ఎన్నికలు అంటే మద్యం, డబ్బు అయిపోయింది. కాంగ్రెస్, BRS, MiM పార్టీలు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నాయి. 16 తర్వాత బీజేపీ లిస్ట్ కూడా వస్తుంది. అన్ని వర్గాల వారికి బీజేపీ మాత్రమే సముచిత స్థానం కల్పిస్తుంది. నోటిఫికేషన్ లోపే మానిఫెస్టో, చార్జిషీట్ కూడా విడుదల చేస్తాం." అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు.

Updated Date - 2023-10-11T18:19:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising