కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TBJP: తెలంగాణకు బీజేపీ అగ్ర నేతల క్యూ.. ఎవరెవరంటే?

ABN, First Publish Date - 2023-11-19T20:15:48+05:30

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న వేళ బీజేపీ(BJP) అగ్ర నాయకత్వం రాష్ట్రానికి తరలి వస్తోంది. ఎలాగైనా గట్టి పోటీ ఇవ్వాలని చూస్తున్న బీజేపీకి జోష్ తేవాలని ఢిల్లీ నేతలు తరలివస్తున్నారు.

TBJP: తెలంగాణకు బీజేపీ అగ్ర నేతల క్యూ.. ఎవరెవరంటే?

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న వేళ బీజేపీ(BJP) అగ్ర నాయకత్వం రాష్ట్రానికి తరలి వస్తోంది. ఎలాగైనా గట్టి పోటీ ఇవ్వాలని చూస్తున్న బీజేపీకి జోష్ తేవాలని ఢిల్లీ నేతలు తరలివస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పలు సభలు, సమావేశాల్లో పాల్గొని ప్రచారం నిర్వహించారు.

ఈ క్రమంలో మరికొందరు తెలంగాణ బాట పట్టారు. ఈ నెల 21న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రానుండగా ఆయన వివిధ సభల్లో పాల్గొననున్నారు. 20న కొల్లాపూర్, ఎల్లారెడ్డి సభల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొంటారు. 25, 26 తేదీల్లో హుజూరాబాద్, మహేశ్వరం సభలకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, 24, 25, 26 తేదీల్లో యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రచారం నిర్వహించనున్నారు. వరుసగా అగ్ర నేతల ప్రచారంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి మరింతగా రాజుకోనుంది.

Updated Date - 2023-11-19T20:15:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising