ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kasani Gnaneshwar: బాబును అరెస్టు చేసి జగన్ తప్పు చేశారు

ABN, First Publish Date - 2023-10-02T21:37:07+05:30

24గంటల పాటు చంద్రబాబు ప్రజల కోసమే పనిచేస్తారని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ (Kasani Gnaneshwar) వ్యాఖ్యానించారు.

హైదరాబాద్,(ఎన్టీఆర్ భవన్): 24గంటల పాటు చంద్రబాబు ప్రజల కోసమే పనిచేస్తారని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్(Kasani Gnaneshwar) వ్యాఖ్యానించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా ఎన్టీఆర్‌ భవన్‌లో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా కాసాని మాట్లాడుతూ...‘‘ప్రజల సంక్షేమం కోసం కష్టపడే వ్యక్తిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తప్పుడు కేసులు పెట్టారు.. తప్పుడు కేసులు ఎన్నో రోజులు నిలబడవు. ప్రపంచ దేశాలు కూడా చంద్రబాబుకు అన్యాయం జరిగిందని చెబుతున్నాయి. బాబును అరెస్టు చేసి జగన్ తప్పు చేశారు... తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు ... చేసిన తప్పుకు మూల్యం చెల్లించుకోక తప్పదు. రెండు రాష్ట్రాలతో పాటు దేశం ఎలా ఉండాలో చంద్రబాబు ఆలోచన చేశారు’’ అని కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు.

Updated Date - 2023-10-02T21:37:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising