ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kasani Gnaneshwar: చంద్రబాబుకు రాజమండ్రి జైలులో ప్రాణహాని ఉంది

ABN, First Publish Date - 2023-10-13T18:25:05+05:30

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu)కు‌ రాజమండ్రి జెలులో ప్రాణహాని ఉందని టీటీడీపీ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్(Kasani Gnaneshwar) తెలిపారు.

హైదరాబాద్, (ఎన్టీఆర్ భవన్): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu)కు‌ రాజమండ్రి జెలులో ప్రాణహాని ఉందని టీటీడీపీ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్(Kasani Gnaneshwar) తెలిపారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘చంద్రబాబుకు జైలులో సరైన వైద్య సదుపాయాలు అందడం లేదు. చంద్రబాబుకు ప్రాణహాని జరిగితే ముఖ్యమంత్రి జగన్‌దే బాధ్యత. చంద్రబాబు నాయుడుకు కావాల్సిన వైద్య సదుపాయాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలం అయింది. చంద్రబాబుకు స్పెషల్‌గా మెడికల్ టీం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు విషయంలో జగన్‌ ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. జగన్ సర్కార్ ప్రతి విషయంలో విఫలం అయింది. ఏపీలో కేవలం అరెస్ట్‌లు, అక్రమ కేసులతో భయబ్రాంతులకు గురిచేసి పాలన చేస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్యం పరిస్థితిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు విషయంలో చొరవ తీసుకోవాలని తెలంగాణ తెలుగుదేశం తరపున డిమాండ్ చేస్తున్నాం. జగన్ కేవలం కక్ష సాధింపు చేస్తున్నారు. తక్షణమే చంద్రబాబు విషయంలో ప్రభుత్వం సరైన సదుపాయాలు ఏర్పాటు చేయకపోతే పరిస్థితి దారుణంగా తయారవుతుంది. జగన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి’’ అని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని‌ జ్ఞానేశ్వర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-10-13T18:50:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising