ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mallikarjuna Kharge: ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు రేవంత్ సాదర స్వాగతం

ABN, First Publish Date - 2023-12-07T12:02:02+05:30

Telangana: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే‌కు రేవంత్‌రెడ్డి స్వాగతం పలికారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకరమహోత్సవానికి ఏఐసీసీ పెద్దలు హాజరుకానున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధఈ, ప్రియాంక గాంధీ హైదరాబాద్‌కు చేరుకున్నారు.

హైదరాబాద్: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే‌కు (AICC Chief Mallikarjuna Kharge) రేవంత్‌రెడ్డి (Revanth Reddy)స్వాగతం పలికారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారమహోత్సవానికి ఏఐసీసీ పెద్దలు హాజరుకానున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. కాసేపటి క్రితమే శంషాబాద్‌ ఎయిర్‌‌పోర్టుకు వచ్చిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ గోపాల్‌కు రేవంత్ సాదర స్వాగతం పలికారు. వారికి పుష్పగుచ్చం ఇచ్చి వెల్కమ్ చెప్పారు. అంతకుముందు హైదరాబాద్ చేరుకున్న హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖ్‌కు రేవంత్ స్వాగతం పలికారు. శంషాబాద్ నుంచి నేరుగా తాజ్ కృష్ణ హోటల్‌కు.. అటు నుంచి సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతో కలిసి రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంకు చేరుకోనున్నారు. ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1.04 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Updated Date - 2023-12-07T12:02:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising