ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS News: హయత్ నగర్ పీఎస్ వద్ద ఉద్రిక్తత.. బీజేపీ నాయకులు, పోలీసుల మధ్య ఘర్షణ

ABN, First Publish Date - 2023-07-30T23:47:51+05:30

నగరంలోని హయత్‌నగర్ పోలీసు‌స్టేషన్ (Hayat Nagar Police Station) వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.

హైదరాబాద్(Hyderabad): నగరంలోని హయత్‌నగర్ పోలీసు‌స్టేషన్ (Hayat Nagar Police Station) వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బడంగ్‌పేట్‌(Badangpet)లో ప్రజా సమస్యల పరిష్కరం కోసం బీజేపీ(BJP) ధర్నా చేపట్టింది. ఈ ధర్నా చేస్తున్న దళితులను అరెస్ట్ చేసి హయత్‌నగర్ పీఎస్‌కు తరలించారు. బాధితులకు మద్దతుగా హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్(Etela Rajender) వచ్చారు. ఈటెల రావడంతో హయత్‌నగర్ పీఎస్ నుంచి అందెల శ్రీరాములుతో పాటు బీజేపీ నాయకులను పోలీసులు బయటకు పంపించారు.

బయటకు పంపుతున్న సమయంలో బీజేపీ నాయకులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో పోలీసులకు, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం హయత్‌నగర్ పోలీసు‌స్టేషన్ వద్ద పోలీసులకు, బీజేపీ నాయకుల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారని బీజేపీ నాయకులు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS GOVT) సమస్యలను గాలికి వదిలేసి మీనమేషాలు లెక్కిస్తోందని కమలం నాయకులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

Updated Date - 2023-07-30T23:53:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising