ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TSRTC MD Sajjanar: క్రీడలతో మానసిక ఉల్లాసం

ABN, First Publish Date - 2023-03-02T16:07:29+05:30

హకీంపేట (Hakimpet) లోని ట్రాన్స్‌పోర్ట్‌ అకాడమీ (Transport Academy) లో అఖిల భార‌త ప్ర‌జా ర‌వాణా సంస్థ‌ల‌ టోర్నమెంట్‌-2023' ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే

మానసిక ఉల్లాసం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: హకీంపేట (Hakimpet) లోని ట్రాన్స్‌పోర్ట్‌ అకాడమీ (Transport Academy) లో అఖిల భార‌త ప్ర‌జా ర‌వాణా సంస్థ‌ల‌ టోర్నమెంట్‌-2023' ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్‌ను టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ (VC Sajjanar), ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు (Dwaraka Tirumala Rao) ప్రారంభించారు. అనంతరం మహారాష్ట్ర ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ జట్ల మధ్య జరిగిన కబడ్డీ మ్యాచ్‌ని వీక్షించారు.

సజ్జనర్‌..

ఈ కబడ్డీ టోర్నమెంట్‌కు టీఎస్‌ఆర్టీసీ ఆతిథ్యం ఇవ్వడంతో పాటు ప్రారంభానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించిందకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ ధన్యవాదాలు తెలియజేశారు. ''క్రీడల్లో అందరూ గెలుపు ముఖ్యం అనుకుంటారు. పాల్గొనడం కూడా గెలుపే. క్రీడల్లో గెలుపోటములను సమానంగా చూడాలి. క్రీడల వల్ల శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ కబడ్డీ టోర్నమెంట్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌ మహారాష్ట్ర, హర్యానా ఆర్టీసీలతో పాటు నవీ ముంబై, బృహణ్‌ ముంబై, పుణే మహానగర్‌ పరివాహన్‌, బెంగళూరు మెట్రోపాలిటన్ ప్ర‌జా ర‌వాణా సంస్థ‌లు పాల్గొంటున్నాయని, ఆయా టీమ్‌లకు టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం తరపున స్వాగతం పలుకుతున్నాము. కబడ్డీ మంచి వ్యాయామ‌ క్రీడ. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఆట‌కు మంచి క్రేజ్‌ ఉంది. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే వారు క్రీడాస్పూర్తిని ప్రదర్శించాలి. విధి నిర్వహణలోనూ ఇదే ర‌క‌మైన స్పూర్తిని కొనసాగించాలి. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఏఎస్‌ఆర్టీయూ ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తోందని, దానికి టీఎస్‌ఆర్టీసీ ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్‌లో ఏఎస్‌ఆర్టీయూ ఏ కార్యక్రమం చేపట్టిన ఆతిథ్యం ఇవ్వడానికి టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం సిద్ధంగా ఉంది’’ అని సజ్జనర్‌ తెలిపారు.

ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ..

ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌టేకింగ్స్ (ఏఎస్‌ఆర్టీయూ) కబడ్డీ టోర్నమెంట్‌ను నిర్వహించడం అభినందనీయమన్నారు. ''ఆర్టీసీ సిబ్బంది విధి నిర్వ‌హ‌ణ‌లో అంకిత‌భావ సేవ‌లు అందిస్తున్నారు. మంచి ఆహార‌పు అల‌వాట్ల‌ను ఏర్ప‌ర‌చుకోవాలి. లేకుంటే ఆరోగ్య సమస్యలు ఉత్ప‌న్న‌మ‌య్యే అవకాశాలు లేక‌పోలేదు. కావున‌ ఆర్టీసీ ఉద్యోగులు రోజువారీ జీవన విధానాన్ని మ‌రింత మెరుగుప‌రుచుకోవాలి. ఆరోగ్యం కోసం యోగా, మెడిటేషన్‌ చేయాలి. పుస్తకాలను చదవాలి. ఆలోచన విధానం మంచిగా ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. క్రీడల్లో గెలుపు ముఖ్యం కాదు. పోటీల్లో ప్రతి క్రీడాకారుడు తమ సామర్థ్యం మేరకు ఉత్త‌మ ఫ‌లితం కోసం ఆరాట‌ప‌డాలి. ఆటను ఎంజాయ్‌ చేయాలి. లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రయాణం అనేది చాలా ముఖ్యం" అని ఆయన అన్నారు.

ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో ఏఎస్‌ఆర్టీయూ డైరెక్టర్ ఆర్‌.ఆర్‌.కె.కిషోర్, టీఎస్‌ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) డాక్టర్ వి. రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పి.వి.ముని శేఖర్, సి.వినోద్ కుమార్, సీపీఎం కె.కృష్ణకాంత్, సీఎంఈ టి.రఘునాథ రావు, సికింద్రాబాద్ ఆర్ఎం వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Shocking Video: అబ్బ.. ఎంత పెద్దదో.. అంటూ బండిని ఆపి మరీ ఖడ్గ మృగాన్ని ఫొటోలు తీశారు.. అంతే మరుక్షణంలోనే ఊహించని సీన్..!

Updated Date - 2023-03-02T16:07:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!