ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KCR Meeting: కేసీఆర్ సభకు బస్సులు.. బస్టాండ్లలలో జనం తిప్పలు

ABN, First Publish Date - 2023-10-17T16:14:30+05:30

‘‘పండుగ సమయంలో ఇదేం చోద్యం.. కేసీఆర్( KCR ) సభలకు బస్సులట’’ అని బీఆర్ఎస్ సర్కార్‌( BRS Govt )పై జనం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి బస్సుల కోసం పడిగాపులు పడాల్సి వస్తోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాజన్న సిరిసిల్ల: ‘‘పండుగ సమయంలో ఇదేం చోద్యం.. కేసీఆర్( KCR ) సభలకు బస్సులట’’ అని బీఆర్ఎస్ సర్కార్‌( BRS Govt )పై జనం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి బస్సుల కోసం పడిగాపులు పడాల్సి వస్తోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేములవాడ, కరీంనగర్ బస్టాండ్లలో సొంతూర్లకు వెళ్లడానికి బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు పండగ పూట నరకయాతన పడుతున్నారు. చిన్నపిల్లలతో బస్టాండ్‌లో గంటల తరబడి బస్సులు కోసం వేచిచూస్తున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేములవాడ, కరీంనగర్ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. సిరిసిల్లలో సీఎం కేసీఆర్ సభ కోసం అధికారులు బస్సులు కేటాయించారు. దీంతో జనానికి సరిపడ బస్సులు లేవు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పండుగ పూట బస్సులను జన సమీకరణకు తరలించడం ఏంటని ప్రయాణికుల బీఆర్ఎస్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

Updated Date - 2023-10-17T16:16:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising