ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yadadri: యాదాద్రిని దర్శించుకున్న కేటీఆర్‌ తనయుడు హిమాన్షు

ABN, First Publish Date - 2023-05-17T21:25:31+05:30

యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడిని సీఎం మనుమడు, కేటీఆర్‌ తనయుడు హిమాన్షు (Himanshu) తన స్నేహితులతో కలిసి దర్శించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడిని సీఎం మనుమడు, కేటీఆర్‌ తనయుడు హిమాన్షు (Himanshu) తన స్నేహితులతో కలిసి దర్శించుకున్నారు. బుధవారం సాయంత్రం యాదగిరిక్షేత్ర సందర్శనకు వచ్చిన హిమాన్షుకు కొండ కింద వైకుంఠద్వారం వద్ద బీఆర్‌ఎస్‌ (BRS) కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడినుంచి ఆయన కొండపైన పడమటి దిశలోని లిఫ్టు గుండా తిరువీధుల్లోకి వచ్చారు. పడమటి సప్తతల మహారాజగోపురం గుండా ప్రదానాలయంలోనికి వెళ్లారు. హిమాన్షుకు దేవస్థాన అధికారులు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పించగా, గర్భాలయంలోని స్వయంభువులను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాకార మండపంలో అర్చకులు ఆయనకు ఆశీర్వచనం చేశారు. దేవస్థాన అధికారులు ఆయనకు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం క్షేత్ర సందర్శనకు విచ్చేసిన భక్తులతో సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు. తూర్పు పంచతల రాజగోపురం నుంచి బయటకు వచ్చిన ఆయన భక్తులతో మాట్లాడుతూ లిఫ్టు వద్దకు చేరుకుని తిరిగి హైదరాబాద్‌కు వెళ్లారు.

Updated Date - 2023-05-17T21:25:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising