ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Srinivas goud: ప్రధాని ఏ మొహం పెట్టుకుని పాలమూరు వస్తున్నారు?

ABN, First Publish Date - 2023-09-30T11:01:41+05:30

జిల్లాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు.

మహబూబ్‌నగర్: జిల్లాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) పర్యటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud) స్పందించారు. ఈ సందర్భంగా ప్రధానిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రేపు (ఆదివారం) పాలమూరుకు వస్తున్న ప్రధాని ఏ మొఖం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్నించారు. పాలమూరుకు లక్ష లేదా 50 వేల కోట్ల ప్యాకేజి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మోడీ గతంలో ఏ వేదిక మీద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా హామీ ఇచ్చి మరిచారో అదే వేదిక మీదకు ఏం ఉద్దరిద్దామని వస్తున్నారని నిలదీశారు. తెలంగాణ డబ్బులతో ప్రాజెక్టులు కట్టుకుంటాము కాని కృష్ణానదిలో నీటివాట తేల్చాలన్నారు. తెలంగాణను అవమానించిన మోడీకి ఇక్కడేమి పని అని ప్రశ్నించారు. మోడీ పాలమూరుకు ద్రోహం చేశారని మండిపడ్డారు. ఈ ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. అడ్డదారుల్లో తెలంగాణలో పాగావేయాలని బీజేపీ చూస్తోందని అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణను బీజేపీ నాశనం చేయాలని చూస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-09-30T11:01:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising