ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mainampally Hanmantha Rao: ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే

ABN, First Publish Date - 2023-10-12T20:36:42+05:30

ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భయభ్రాంతులకు గురి కావద్దని .. రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హన్మంతరావు(Mainampally Hanmantha Rao) వ్యాఖ్యానించారు.

మెదక్: ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భయభ్రాంతులకు గురి కావద్దని .. రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హన్మంతరావు(Mainampally Hanmantha Rao) వ్యాఖ్యానించారు. గురువారం నాడు మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది. ఈ సమ్మేళనంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ నేత రోహిత్‌రావు పాల్గొన్నారు. ఈసందర్భంగా మైనంపల్లి మీడియాతో మాట్లాడుతూ..‘‘ భయభ్రాంతులకు గురి చేసే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు నిష్క్రమించవద్దు. నేను మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వానికి భయపడే వ్యక్తిని కాను. మీ అక్రమాలను బయటకు తీసి మిమ్మల్ని జైలుకు పంపించే వరకు నిద్రపోను. కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం. 15 తేదీ తర్వాత ప్రజలను మోసం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను మీ ముందుకు తీసుకొస్తుంది. ఎవరు ఆ మేనిఫేస్టోను నమ్మవద్దు’’ అని మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు.

Updated Date - 2023-10-12T20:59:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising