ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ponnam Prabhakar: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణ

ABN, First Publish Date - 2023-12-13T10:26:55+05:30

Telangana: తెలంగాణ రాష్ట్రంలో హుస్నాబాద్ నిర్లక్ష్యానికి గురైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. గౌరవెళ్లి, దేవాదుల పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి సాగుకు నీళ్లిస్తామన్నారు. జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జరుగుతుందని తెలిపారు.

సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రంలో హుస్నాబాద్ నిర్లక్ష్యానికి గురైందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. బుధవారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. గౌరవెళ్లి, దేవాదుల పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి సాగుకు నీళ్లిస్తామన్నారు. జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట గౌరవెల్లి ప్రాజెక్ట్ అని విమర్శించారు. ఇంతవరకు డిస్ట్రిబ్యూషన్ కాలువల నిర్మాణమే లేదని.. టాంక్ నింపి నీళ్ళు ఇవకుంటే ఏం చేసుకుంటామని ప్రశ్నించారు. తోటపల్లి భూ నిర్వాసితుల సమస్య ప్రస్తుతం కోర్టులో ఉందన్నారు. అది సీఎం స్థాయిలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. భూ నిర్వాసితుల సమస్యలను అప్పటి ఎమ్మెల్యే వారితో దురుసుగా ప్రవర్తించి జఠిలం చేశామన్నారు. ఈ సమస్యపై అప్పటి మంత్రి హరీశ్ రావు సానుకూలంగా స్పందించినా, స్థానిక ఎమ్మెల్యే వైఖరి కారణంగా అది ముందుకు సాగలేదన్నారు. డబుల్ బెడ్ రూంలు తమ విధానం కాదని.. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. గజ్వేల్ ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో అప్పటి సర్కారు అనాలోచితంగా వ్యవహరించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు.

Updated Date - 2023-12-13T10:26:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising