ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Purandeshwari: రాజకీయాలకు అతీతమైన వ్యక్తి ఎన్టీఆర్..

ABN, Publish Date - Jan 20 , 2024 | 03:20 PM

Andhrapradesh: ఉరవకొండలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ సందర్భంగా ఉరవకొండలో బీజేపీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు.

అనంతపురం, జనవరి 20: ఉరవకొండలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి (AP BJP Chief Purandeshwari), ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (Uravakonda MLA Payyavula Kesav) పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ సందర్భంగా ఉరవకొండలో బీజేపీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిందే ఎన్టీఆర్ అని అన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ నిలబెట్టారని తెలిపారు. రాజకీయాలకు అతీతమైన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ఆ రోజుల్లో తీసుకొచ్చిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలనే ఇవాల్టికీ అన్ని రాజకీయ పార్టీలు కొనసాగిస్తున్నాయన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఇవాళ ఎన్టీఆర్ పేరు ఎత్తకుండా రాజకీయాలు మాట్లడలేని పరిస్థితి ఏర్పడిందని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి పేర్కొన్నారు.

కాగా.. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.. టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. విగ్రహావిష్కరణలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంధిరెడ్డి శ్రీనివాసులు, బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 20 , 2024 | 03:20 PM

Advertising
Advertising