GAMES : ముగిసిన బధిరుల వాలీబాల్, చెస్ క్రీడా పోటీలు
ABN, Publish Date - Sep 24 , 2024 | 12:20 AM
జిల్లా బధిరుల క్రీడా పోటీలు ముగిశాయి. జిల్లా స్పోర్ట్స్ ఫెడరేషన ఆఫ్ ది డెఫ్ ఆధ్వర్యంలో బుక్కరాయసముద్రం సమీపంలోని ఆర్డీటీ బధిర పాఠశాలలో సోమవారం బధిర క్రీడాకారులకు వాలీబాల్, చెస్ క్రీడా పోటీలు నిర్వహించారు. విజేతల వివరాలను ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కృష్ణ, సత్యనారాయణ రెడ్డి ప్రకటించారు.
అనంతపురం క్లాక్టవర్, సెప్టెంబరు 23: జిల్లా బధిరుల క్రీడా పోటీలు ముగిశాయి. జిల్లా స్పోర్ట్స్ ఫెడరేషన ఆఫ్ ది డెఫ్ ఆధ్వర్యంలో బుక్కరాయసముద్రం సమీపంలోని ఆర్డీటీ బధిర పాఠశాలలో సోమవారం బధిర క్రీడాకారులకు వాలీబాల్, చెస్ క్రీడా పోటీలు నిర్వహించారు. విజేతల వివరాలను ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కృష్ణ, సత్యనారాయణ రెడ్డి ప్రకటించారు. వాలీబాల్లో ఎ- గ్రూపు విజేతగా అజయ్కుమార్ నిలవగా, ద్వితీయ స్థానంలో సి - గ్రూపు నవీనకుమార్, తృతీయ బహుమతి అభిలాష్ గెలుపొందారు. చెస్లో మొదటి స్థానంలో టిప్పుసుల్తాన, రెండో స్థానంలో గౌతమి, మూడో స్థానంలో వీరప్రసాద్ విజేతలుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రఫీక్, ప్రిన్సిపాల్ ఎర్రిస్వామి, పీఈటీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Sep 24 , 2024 | 12:20 AM