ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA DAGGUPATI : వంద రోజుల్లోనే ఎంతో మేలు చేశాం

ABN, Publish Date - Sep 21 , 2024 | 12:21 AM

అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే ప్రజలకు ఎంతో మేలు చేసి చూపించామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం అనంతపురం రూరల్‌ మండలం రుద్రంపేట పంచాయతీలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి... వంద రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. స్థానిక సమస్యలపై ఆరా తీశారు.

This is MLA Daggupati who is sticking the sticker of good government

ఎమ్మెల్యే దగ్గుపాటి

అనంతపురం అర్బన, సెప్టెంబరు 20 : అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే ప్రజలకు ఎంతో మేలు చేసి చూపించామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం అనంతపురం రూరల్‌ మండలం రుద్రంపేట పంచాయతీలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి... వంద రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. స్థానిక సమస్యలపై ఆరా తీశారు. పలు ఇళ్లకు ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను అతికించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..


. గత ఐదేళ్లలో జగన ప్రభుత్వం రాష్ర్టా న్ని అప్పులమయం చేసిందన్నారు. ఇలాంటి కష్ట సమయంలోనూ కూటమి ప్రభుత్వం వంద రోజుల్లోనే అనేక హామీలు అమలు చేసిందన్నారు. ఓ వైపు వరదలు, మరోవైపు అనేక సవాళ్లు ఎదురైనా సీఎం చంద్రబాబు సమర్థవం తంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్‌, మంత్రి నారాలోకేశ మంచి పాలన దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ హరికుమార్‌, నాయకులు మల్లికార్జున, రాయల్‌ మురళి, గంగారామ్‌, సరిపూటి రమణ, లక్ష్మీనరసింహ, శ్రీనివాస్‌రెడ్డి, పోతుల లక్ష్మీనరసింహులు, ఎస్‌ఎం బాషా, నాగభూషణం, బాలప్ప, సుధాకర్‌, మహేష్‌, అంజి, ఆది, శీనప్ప తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 21 , 2024 | 12:21 AM