ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA DAGGUPATI : ఐదేళ్ల అవినీతిని బయటకు తీస్తాం

ABN, Publish Date - Sep 26 , 2024 | 12:10 AM

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అవినీతి లెక్కలు బయటకు తీస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంక టేశ్వరప్రసాద్‌ పేర్కొన్నారు. స్థానిక ఎర్రనేల కొట్టాల, మారుతీనగర్‌లో బుధ వారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌ హాజరయ్యారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు.

MLA Daggupati Prasad speaking in the meeting

ఎమ్మెల్యే దగ్గుపాటి

అనంతపురం అర్బన, సెప్టెంబరు 25 : గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అవినీతి లెక్కలు బయటకు తీస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంక టేశ్వరప్రసాద్‌ పేర్కొన్నారు. స్థానిక ఎర్రనేల కొట్టాల, మారుతీనగర్‌లో బుధ వారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌ హాజరయ్యారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఇది ప్రజా ప్రభుత్వమని, ప్రజలకు ఏకష్టం లేకుండా చేయడమే లక్ష్యమన్నారు. గత ఐదేళ్లలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మే యర్‌ వసీం తప్పించుకోలేరన్నారు. డంపింగ్‌ యార్డు అవినీతిపై జేసీతో విచా రణకు ఆదేశించామని, పనిముట్ల వ్యవహారం ఫిర్యాదులపై విచారణ చేయి స్తామన్నారు. కూటమి ప్రభు త్వం మైనార్టీల పక్షపాతి అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్‌ నాగరాజు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన గౌస్‌మొద్దీన, తలారి ఆదినారాయణ, బుగ్గయ్య చౌదరి, గాజుల ఆదెన్న, గోళ్ల సుధాకర్‌ నాయుడు, పోతుల లక్ష్మీనరసింహులు, రాజారావు, పీఎం లక్ష్మీప్రసాద్‌, లక్ష్మీనరసింహ, నెట్టెం బాలకృష్ణ, బాబాఫకృద్దీన, రంగాచారి, సీసాల శ్రీనివాసులు, కొండవీటి భావన, స్వప్న, బల్లా పల్లవి, రహమత బీ, సంగా తేజస్విని, జనసేన నాయకురాలు పెండ్యాల శ్రీలత పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 26 , 2024 | 12:10 AM