ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA DAGGUPATI: అభివృద్ధిని అటకెక్కించిన వైసీపీ

ABN, Publish Date - Sep 12 , 2024 | 11:52 PM

వైసీపీ పాలనలో అభివృద్ధిని అటకెక్కించిందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ విమర్శించారు. గురువారం మండలంలోని ఎ.నారాయాణపురం పంచాయతీ తపోవనంలో సీసీరోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే హాజరై స్థానిక నాయకులు, అధికారులతో కలసి భూమి పూజ చేశారు.

MLA performing Bhumi Puja for road construction works

ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌

అనంతపురంరూరల్‌, సెప్టెంబరు 12: వైసీపీ పాలనలో అభివృద్ధిని అటకెక్కించిందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ విమర్శించారు. గురువారం మండలంలోని ఎ.నారాయాణపురం పంచాయతీ తపోవనంలో సీసీరోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే హాజరై స్థానిక నాయకులు, అధికారులతో కలసి భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి వందరోజులు కూడా గడవకుండానే నియోజకవర్గంలోని పంచాయతీల్లో అభివృద్ధిపనులకు శ్రీకారం చుట్టామన్నారు. ఎనఆర్‌జీఎ్‌స కింద రూ.3కోట్లతో సీసీరోడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. నారాయణపురం పంచాయతీలో రూ.55లక్షల పనులకు భూమి పూజ చేశామన్నారు. పనులు నెలరోజుల్లో పూర్తిచేసి కొత్తవాటికి ప్రతిపాదనలు చేస్తామన్నారు. ఎంపీడీఓ పుల్లయ్య, పంచాయతీ స్పెషల్‌ ఆఫీసర్‌ సురేష్‌, కార్యదర్శి అశోక్‌బాబు, టీడీపీ నాయకులు రాగే మురళీమోహన, డిష్‌ నా గరాజు, మాజీ సర్పంచు రామలక్ష్మి, ఓబులపతి, నాగరాజు, రఘునాథ్‌రాయల్‌, మురళీ, రజినీ, అక్షిత, అమరనాథ్‌, రంగనాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 11:52 PM

Advertising
Advertising