ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: ఎంపీ బైరెడ్డి స్వగ్రామంలో దారుణం.. తొమ్మిదేళ్ల చిన్నారిని..

ABN, Publish Date - Jul 10 , 2024 | 09:52 AM

పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో దారుణం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం తొమ్మిదేళ్ల బాలిక అదృశ్యమైంది. ఈ కేసును విచారించిన పోలీసులు కృష్ణా నదిలో బాలిక శవాన్ని గుర్తించారు. ఆదివారం ఇంటి సమీపంలోని పార్కులో బాలిక ఆడుకుంటుండగా ముగ్గురు మైనర్ బాలురు ఊరి బయటకు తీసుకెళ్లారు.

నంద్యాల: పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో దారుణం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం తొమ్మిదేళ్ల బాలిక అదృశ్యమైంది. ఈ కేసును విచారించిన పోలీసులు కృష్ణా నదిలో బాలిక శవాన్ని గుర్తించారు. ఆదివారం ఇంటి సమీపంలోని పార్కులో బాలిక ఆడుకుంటుండగా ముగ్గురు మైనర్ బాలురు ఊరి బయటకు తీసుకెళ్లారు. చిన్నారిపై అత్యాచారం చేసి, ఆ తర్వాత నీళ్లలోకి తోసేసారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


ముగ్గురు మైనర్ బాలురులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. చిన్నారి మృతితో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి స్వగ్రామం ముచ్చుమరిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరి కాసేపట్లో ముచ్చుమరికి రానున్న జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి రానున్నారు. ఈ ఘటనపై మచ్చుమర్రి గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా చిన్నారి మృతిపై నిజానిజాలను తేల్చి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

Updated Date - Jul 10 , 2024 | 09:52 AM

Advertising
Advertising
<