ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: శభాష్ సోనూసూద్.. చంద్రబాబు ప్రశంసలు

ABN, Publish Date - Sep 05 , 2024 | 12:05 PM

తెలుగు రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేస్తున్న వేళ సినిమా రంగానికి చెందిన వారు ఎందరో తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు.

అమరావతి: తెలుగు రాష్ట్రాలను వరదలు అతలాకుతలం చేస్తున్న వేళ సినిమా రంగానికి చెందిన వారు ఎందరో తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే సోనూసూద్ సైతం తెలుగు రాష్ట్రాల కోసం ముందుకొచ్చారు. వరద బాధితుల కోసం ఆహారం, నీరు, మెడిసన్స్ అందిస్తున్నట్లు చెప్పారు.

సోనూసూద్(SonuSood) సాయం చేయడంపై సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu) హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయాలని ఉన్న ఆయన నిబద్ధతను కొనియాడారు. సోనూసూద్ సాయం ప్రజలకు ఓదార్పునిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.


సోనూసూద్ బృందాలు..

భారీ వర్షాలు, వరదలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. వరదల కారణంగా భారీగా ఆస్తి నష్టం జరిగింది. వేల సంఖ్యలో వరదల్లో చిక్కుకుపోయారు. బాధిత కుటుంబాలను కాపాడేందుకు చిక్కుకున్న వారికి ఆహారం అందించేందుకు ప్రముఖులు తోచిన విధంగా విరాళాలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ నటుడు సోనూసూద్ తెలుగు రాష్ట్రాలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. మంచినీరు, ఆహారం, మెడికల్ కిట్స్ అందివ్వడంతో పాటు పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసేందుకు సోనూసూద్ టీం పని చేస్తోందని తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాలు వరదలతో యుద్ధం చేస్తున్నాయని, ఇలాంటి సమయంలో వారికి తాము అండగా ఉంటామని సోనూసూద్ వీడియోలో పేర్కొన్నారు. సాయం కోరుకునే వారు సోనూసూద్‌ చారిటీ ఫౌండేషన్ ఈ మెయిల్‌ ద్వారా సంప్రదించవచ్చని చెప్పారు. మెయిల్‌లో సంప్రదించాలన్నారు.

For Latest News click here

Updated Date - Sep 05 , 2024 | 12:05 PM

Advertising
Advertising