ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirumala..శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన మహా శాంతి యాగం..

ABN, Publish Date - Sep 23 , 2024 | 07:10 AM

రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో.. సోమవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మహా శాంతి హోమాన్ని నిర్వహిస్తున్నామని, ముందుగా మహ శాంతి యాగం, వాస్తూ హోమం నిర్వహణ జరుగుతుందని, చివరిగా పంచగవ్యాలతో అర్చకులు సంప్రోక్షణ నిర్వహిస్తారని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.

తిరుమల: శ్రీవారి ఆలయంలో (Tirumala) మహా శాంతి యాగం (Maha Shanthi Yagam) ప్రారంభమైంది. ఆలయంలోని యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు హోమం (Homam) నిర్వహిస్తున్నారు. తిరుమల.. శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యిలో కల్తీ కారణంగా శ్రీవారి ఆలయంలో హోమాన్ని నిర్వహిస్తున్నామని.. హోమం పూర్తి అయిన తరువాత లడ్డూ పోటుతో పాటు ఆలయంలో పంచగవ్యాలతో సంప్రోక్షణ కార్యక్రమాని నిర్వహిస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు (TTD EO Shyamala Rao) తెలిపారు. సోమవారం రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో.. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మహా శాంతి హోమాన్ని నిర్వహిస్తారు. ముందుగా మహ శాంతి యాగం, వాస్తూ హోమం నిర్వహణ జరుగుతుంది. చివరిగా పంచగవ్యాలతో అర్చకులు సంప్రోక్షణ నిర్వహించనున్నారు. కాగా శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలకు ఆటంకం కలగకుండా ఒక్క రోజు మాత్రమే యాగం నిర్వహించేలా ఆగమ పండితులు నిర్ణయించారు.


తిరుమల పవిత్రతకు ఉద్దేశపూర్వకంగానే పాతర వేశారని తేలిపోయింది. తవ్వేకొద్దీ జగన్‌ అరాచక పాలన సృష్టించిన సంక్షోభం తెలిసి వస్తోంది. అధికారంలోకి రావడం రావడమే తిరుమల పాలనను అస్తవ్యస్తం చేసేశారు. అత్యంత వివాదాస్పదులుగా ముద్రపడిన తన బంధువులకు, అధికారులకు టీటీడీ పగ్గాలు అప్పగించి, వారి ఇష్టారాజ్యానికి కలియుగ దైవాన్నీ, భక్తులనూ వదిలేశారు. నాణ్యతకు, పవిత్రతకు భరోసా ఇచ్చిన డెయిరీల నుంచి నెయ్యి సేకరణను ఆపివేయించడం జగన్‌ అరాచకపర్వానికి పరాకాష్ఠ. నచ్చిన కంపెనీలకు నెయ్యి కాంట్రాక్టు ఇవ్వడానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన లడ్డూ పవిత్రతను సైతం మంటగలిపేశారు.


రాష్ట్రంలోని టీటీడీ సహా ప్రముఖ ఆలయాల అవసరాల కోసం నెయ్యిని స్థానిక సహకార డెయిరీల నుంచి కొనుగోలు చేసేవారు. తిరుమల పవిత్రతను, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్థానిక డెయిరీల నుంచి మంచి నెయ్యిని సేకరించేవారు. దీనికోసం అప్పటి ప్రభుత్వాలు జీవో 418ను కూడా జారీచేశాయి. ఈ ప్రక్రియను ఈ - ప్రొక్యూర్‌మెంట్‌ విధానం ద్వారా చేపట్టాలని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. తిరుమల పవిత్రతను కాపాడటానికి తీసుకున్న ఈ నిర్ణయాన్ని మరింత బలపరుస్తూ 2019లో అప్పటి టీడీపీ ప్రభుత్వం మరొక సర్యూలర్‌ జారీచేసింది. ప్రముఖ ఆలయాల్లో ఉపయోగించే నెయ్యిని కూడా స్థానిక సహాకార డెయిరీల నుంచి కొనుగోలు చేయాలని అందులో స్పష్టం చేసింది. ఆ తర్వాత కొద్ది మాసాలకే టీడీపీ ప్రభుత్వం దిగిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 2020లో నెయ్యి ప్రొక్యూర్‌మెంట్‌ విధానంలో మార్పులు తీసుకువచ్చింది. కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ అప్పటివరకు తిరుమల ఆలయం అవసరాల కోసం సరఫరా చేస్తున్న నందినీ బ్రాండ్‌ నెయ్యిని నిలిపివేసింది. దీంతో తిరుమల పవిత్రత అనేది పూర్తిగా సంక్షోభంలో పడిపోయింది. రివర్స్‌ టెండరింగ్‌ విధానం ద్వారా గత జగన్‌ ప్రభుత్వం నాడు ఎంపిక చేసిన ఐదు కంపెనీల్లో ఒకటి సరఫరా చేసిన నెయ్యిలోనే పంది, ఎద్దు కొవ్వు, చేప నూనెలు, వెజిటబుల్‌ ఆయిల్‌ ఉన్నట్టు బయటపడటం, దానిపై దేశమంతా భగ్గుమనడం తెలిసిందే.


చర్చి, మసీదులో జరిగితే దేశం అల్లకల్లోలం అయిపోయేది.. పవన్

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడం దుర్మార్గమైన చర్య అని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. లడ్డూకు వినియోగించిన నెయ్యిలో పశువుల కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె, సోయా, సన్‌ ఫ్లవర్‌ లాంటి ఇతర నూనెలు ఉన్నట్లు ఎన్‌ఏడీబీ సీఏఎల్‌ఎఫ్‌ ల్యాబ్‌ నివేదిక ఇచ్చిందని వెల్లడించారు. వైసీపీ హయాంలో ఇలాంటి నేతిని వినియోగించిన లక్ష లడ్డూలను అయోధ్య రామ జన్మభూమి మందిరానికి టీటీడీ పంపి చాలా పెద్ద తప్పు చేసిందని అన్నారు. హిందువులు మహాప్రసాదంగా భావించే తిరుమల లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలపడం నీచమైన చర్య అని దుయ్యబట్టారు. ప్రతి హిందువూ, ధర్మాన్ని పాటించే ప్రతి వ్యక్తి దీన్ని ఖండించి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

తిరుపతి లడ్డూ ప్రసాదం అపవిత్రమైన నేపథ్యంలో క్షమించమని వేంకటేశ్వర స్వామిని కోరుతూ పవన్ కల్యాణ్ ఆదివారం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట గల శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష మాలధారణ తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ... కేబినెట్‌, అసెంబ్లీలో చర్చించి దోషులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ‘‘తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా జగన్‌ వారిని ఎలా సమర్థిస్తారు? కోట్ల మంది హిందువులు స్వీకరించే ప్రసాదాన్ని అపవిత్రం చేస్తారా? దోషులకు శిక్ష పడాల్సిందే. చర్చి, మసీదులో ఇలా జరిగితే దేశం అల్లకల్లోలం అయిపోయేది. ప్రపంచం అంతా మాట్లాడేది. గ్లోబల్‌ న్యూస్‌ అయ్యేది. అదే హిందువులకు జరిగితే మాట్లాడకూడదా? సెక్యూలర్‌ వ్యవస్థకు విఘాతం కలుగుతుందా? హిందువులకు మనోభావాలు ఉండవా? ఏ మతంపై దాడి జరిగినా ఇలాగే స్పందిస్తాం. గత ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డిని సూటిగా అడుగుతున్నాను. తిరుమలలో జరిగిన విధంగా ఒక చర్చికి అపవిత్రం జరిగితే ఊరుకుంటావా? ఒక మసీదుకు జరిగితే ఊరుకుంటావా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కుటుంబానికో.. డిజిటల్‌ కార్డు

లడ్డూ అపచారంపై సిట్‌ దర్యాప్తు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 23 , 2024 | 08:36 AM