ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YSRCP: వైసీపీకి ఇక చుక్కలే.. భూకబ్జాలపై కమిటీ..!

ABN, Publish Date - Jul 29 , 2024 | 07:24 AM

వైసీపీ భూ కబ్జాలపై హైకోర్ట్ సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో విచారణ జరగనుంది. ఈ రోజు చంద్రబాబు సమీక్షలో రెవెన్యూ శాఖ ప్రతిపాదించనుంది.

అమరావతి: వైసీపీ భూ కబ్జాలపై హైకోర్ట్ సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో విచారణ జరగనుంది. ఈ రోజు చంద్రబాబు సమీక్షలో రెవెన్యూ శాఖ ప్రతిపాదించనుంది. ఇక సీనియర్ ఐఏఎస్, మరో సీనియర్ ఐపీఎస్ లు కమిటీలో ఉండే విధంగా ప్రతిపాదించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల భూకబ్జాలపై ఆధారాలతో సహా కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందాయి. మొన్న మదనపల్లి ఘటనలో అక్కడకు వెళ్లిన సిసోడియాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, మంత్రులకు కూడా భూకబ్జాలపై ఫిర్యాదులు అందాయి. టీడీపీ కేంద్ర కార్యాలయానికి కూడా భారీగా ఫిర్యాదులు అందాయి. అందుకనే ఉన్నత స్థాయి విచారణ జరిపాలని ప్రభుత్వం నిర్ణయించింది.


విలువైన ప్రభుత్వ భూముల పరాధీనం, ప్రైవేటు భూములను ఏపీలో పెద్ద ఎత్తున రాజకీయ నేతలు చెరపట్టారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే రాష్ట్ర హైకోర్టు సిటింగ్‌ జడ్జి నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఇవాల చంద్రబాబుతో జరగనున్న సమావేశంలో రెవెన్యూ శాఖ కమిటీతో విచారణను ప్రతిపాదించనుంది. కమిటీలో ఒక సీనియర్‌ ఐఏఎస్‌, సీనియర్‌ ఐపీఎస్‌ ఉండేలా కూర్పును ప్రతిపాదించనున్నట్టు సమాచారం. ఈ కమిటీ రాష్ట్రంలోని బాధితులు ఎక్కువగా ఉన్న ప్రతి ఒక్క ప్రాంతానికి వెళ్లి విన్నపాలు స్వీకరించనుంది. రాష్ట్రంలో వైసీపీ నేతల భూ అక్రమాలు, పేదలపై వారు చేసిన అరాచకాలపై సమగ్ర విచారణ ఉంటుందని చంద్రబాబు ఈ నెల 15వ తేదీన ప్రకటించిన సంగతి తెలిసిందే.


ఆ తర్వాత కొద్దిరోజులకే ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలోని రెవెన్యూ రికార్డులకు అగంతకులు నిప్పుపెట్టారు. భూ అక్రమాలు, దందాలు బయటకు రాకుండా ఉండేందుకే కుట్రపూరితంగా సబ్‌కలెక్టర్‌ ఆఫీసుకు నిప్పుపెట్టారని రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఆర్‌.పి.సిసోడియా ప్రభుత్వానికి ఇప్పటికే ప్రాథమిక నివేదిక ఇచ్చారు. సోమవారం సీఎం వద్ద జరిగే సమావేశానికి మరో నివేదికను ఆయన ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గత ఐదేళ్లుగా సాగిన రాజకీయ నేతల భూ ఆక్రమణలు, దౌర్జన్యాలపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే, కమిటీకి సహకరించేందుకు, చట్టబద్ధంగా, అధికారికంగా కేసుల పరిష్కారానికి వీలుగా జోన్‌ల వారీగా క్వాజీ జ్యుడీషియల్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించనున్నట్టు సమాచారం. మరోవైపు, రాష్ట్రంలో అసైన్డ్‌, చుక్కల భూముల పరిస్థితి, కుల ధృవీకరణ సర్టిఫికెట్లలో తీసుకురావాల్సిన మార్పులపై భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ జయలక్ష్మి నివేదిక ఇవ్వనున్నారు.

జగన్‌ ఇంత పిరికితనమా.. సిగ్గు సిగ్గు

Read more AP News and Telugu News

Updated Date - Jul 29 , 2024 | 08:10 AM

Advertising
Advertising
<