ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan: జనసేన కేంద్ర కార్యాలయం వద్ద రోడ్డుపైనే ప్రజాదర్బార్ నిర్వహించిన పవన్..

ABN, Publish Date - Jun 22 , 2024 | 05:45 PM

గుంటూరు జిల్లా మంగళగిరి (Mangalagiri)లోని జనసేన కేంద్ర కార్యాలయం వద్ద రోడ్డుపైనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజాదర్బార్ నిర్వహించారు. తాజాగా ఉప ముఖ్యమంత్రి (Deputy CM)గా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బాధ్యతలు చేపట్టడం అటు అసెంబ్లీ సమావేశాల్లోనూ ఆయన పాల్గొనడంతో సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు జనసేన కార్యాలయానికి బారులు తీరుతున్నారు.

అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి(Mangalagiri)లోని జనసేన కేంద్ర కార్యాలయం వద్ద రోడ్డుపైనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజాదర్బార్ నిర్వహించారు. తాజాగా ఉప ముఖ్యమంత్రి (Deputy CM)గా పవన్ కల్యాణ్(Pawan Kalyan) బాధ్యతలు చేపట్టడం అటు అసెంబ్లీ సమావేశాల్లోనూ ఆయన పాల్గొనడంతో సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు జనసేన కార్యాలయానికి బారులు తీరుతున్నారు. జనసేన కార్యాలయానికి అప్పుడే వచ్చిన డిప్యూటీ సీఎం.. కారు నుంచి దిగి రోడ్డుపైనే కుర్చీలు వేయించి వారితో మాట్లాడారు.


సమస్యలు విన్న పవన్ కల్యాణ్.. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అర్జీదారుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా బాధితులు తమ సమస్యలు చెప్పుకొని వాటిని తీర్చాలని కోరగా.. అధికారులతో ఫోన్‌లో మాట్లాడి కొన్ని సమస్యలు తక్షణమే పరిష్కరించారు. మరికొన్ని సమస్యల పరిష్కారానికి కాల పరిమితి నిర్ణయించి ఆలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డుపైనే ప్రజాదర్బార్ నిర్వహించి తమ సమస్యలు పరిష్కరించడంతో ప్రజలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Adala Prabhakar Reddy: నెల్లూరులో రెచ్చిపోయిన మాజీ ఎంపీ ఆదాల అనుచరులు..

Jagan Convoy Accident: మాజీ సీఎం జగన్ కాన్వాయ్‌కి తృటిలో తప్పిన ప్రమాదం..

Updated Date - Jun 22 , 2024 | 07:03 PM

Advertising
Advertising