ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Politics : బీటెక్ రవితో బ్రదర్ అనిల్‌ భేటీ.. ఇరువురి మధ్య ఆసక్తికర సంభాషణ

ABN, Publish Date - Jan 03 , 2024 | 03:19 PM

Andhrapradesh: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న వార్త సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా షర్మిల భర్త బ్రదర్ అనిల్, పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కడప ఎయిర్‌పోర్టులో వీరిద్దరు కలిగి ఫోటోలు దిగినట్లు తెలుస్తోంది.

అమరావతి: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న వార్త సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా షర్మిల భర్త బ్రదర్ అనిల్ (Brother Anil), పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి(Pulivendula TDP in-charge B.Tech Ravi) కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కడప ఎయిర్‌పోర్టులో వీరిద్దరు కలిగి ఫోటోలు దిగినట్లు తెలుస్తోంది. కడప నుంచి విజయవాడకు వస్తుండగా కడప ఎయిర్‌పోర్టులో బీటెక్ రవి, బ్రదర్ అనిల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఆసక్తికర సంభాషణ నడిచింది. ఒకే ఫ్లైట్‌లో బీటెక్ రవి, బ్రదర్ అనిల్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇరువురు మధ్య జరిగిన భేటీలో పలు రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.

షర్మిల పీసీసీ తీసుకుంటే ఎలా ఉంటుందని బీటెక్ రవి, బ్రదర్ అనిల్ మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. రేపు(గురువారం) కాంగ్రెస్‌లో చేరుతున్నామని... షర్మిల ఏపీ కాంగ్రెస్‌లో చేరితే రాజకీయాలు ఎలా ఉంటాయని బీటెక్‌ రవిని బ్రదర్ అనిల్ అడగగా.. ఏపీ కాంగ్రెస్‌లో షర్మిల చేరితే అన్ని విధాలా బాగుంటుందని బీటెక్‌ రవి సలహా ఇస్తూ.. శుభాకాంక్షలు తెలియజేసినట్లు సమాచారం. అలాగే కడప జిల్లాలో రాజకీయం ఎలా ఉంటుందని కూడా బ్రదర్ అనిల్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కడప ఎయిర్ పోర్టులో ఫ్లైట్ లేట్ కావడంతో అరగంటకు పైగా వీరి మధ్య సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. స్పెషల్ ప్లైట్‌లో విజయలక్ష్మి, షర్మిల విజయవాడ వస్తున్నారని బ్రదర్ అనిల్ చెప్పినట్లు సమాచారం. అనంతరం ఫ్లైట్‌లో వేర్వేరు సీట్లు కావడంతో బీటెక్ రవి ముందుగానే ఎయిర్ పోర్టులో దిగి పార్టీ కార్యాలయానికి వెళ్లగా.. బ్రదర్ అనిల్ కేసర్‌పల్లిలో గెస్టు హౌస్‌కు వెళ్లారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 03 , 2024 | 04:32 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising