AP News: మైదుకూరులో వైసీపీ నేతల వింత ధోరణి
ABN, Publish Date - Feb 13 , 2024 | 10:07 AM
Andhrapradesh: జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గంలో వైసీపీ నేతల వింత ధోరిణితో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఖాజీపేట మండలం పుల్లూరు ఎస్సీ ఎస్టీ కాలనీలో వైసీపీ నేత నాగేశ్వరెడ్డి గ్రామంలోని గుడికి విరాళమిచ్చారు.
కడప, ఫిబ్రవరి 13: జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గంలో వైసీపీ నేతల వింత ధోరిణితో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఖాజీపేట మండలం పుల్లూరు ఎస్సీ ఎస్టీ కాలనీలో వైసీపీ నేత నాగేశ్వరెడ్డి గ్రామంలోని గుడికి విరాళమిచ్చారు. అయితే ఇటీవల కాలనీవాసులు టీడీపీ కండువా కప్పుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు వైసీపీ నేత... తాను గుడికి ఇచ్చిన విరాళం వెనక్కి ఇవ్వాలని బెదిరింపులకు దిగాడు. అంతేకాకుండా గ్రామస్తులకు చెందిన ట్రాక్టర్ను లాక్కుని ఇంటి దగ్గర పెట్టుకున్నాడు. దీంతో చేసేదేమీ లేక గ్రామస్తులు చందాలు వేసుకొని మరీ లక్ష రూపాయలు విరాళాన్ని తిరిగి వైసీపీకి నేతకు ఇచ్చేసి.. ట్రాక్టర్ను విడిపించుకున్నారు. అయితే వైసీపీ నేత తీరుపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Feb 13 , 2024 | 10:07 AM