ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Cyclone: బంగాళాఖాతంలో బలపడుతున్న రెమాల్ తుఫాను

ABN, Publish Date - May 24 , 2024 | 10:49 AM

హైదరాబాద్: నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. శుక్రవారం నాటికి వాయుగుండంగా.. ఆ తర్వాత ఈశాన్యంగా పయనించి శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారనుంది. దీనికి రెమాల్‌గా పేరు పెట్టారు.

హైదరాబాద్: నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. శుక్రవారం నాటికి వాయుగుండంగా.. ఆ తర్వాత ఈశాన్యంగా పయనించి శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా (Cyclone) మారనుంది. దీనికి రెమాల్‌ (Remal)గా పేరు పెట్టారు. మరింత బలపడి తీవ్ర తుపానుగా మారి ఆదివారం సాయంత్రం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిషాలో భారీ వర్షాలు కురుస్తాయని తీరం దాటేటప్పుడు వంద కి.మీ.పైగా గాలులు వీస్తాయని తెలియజేసింది. అయితే ఆంధ్రప్రదేశ్‌కు ముప్పు లేనట్టేనని వాతావరణ నిపుణులు తెలియజేశారు. ఇదే సమయంలో తీరానికి దూరంగా తుపాను పయనించనున్నందున ఆ దిశగా భూ ఉపరితలం మీద నుంచి వేడి గాలులువీయనున్నాయి. ఇప్పటికే వాయువ్య భారతం నుంచి తీవ్ర వడగాల్పుల మధ్య ఒడిషా ఆంధ్రప్రదేశ్ మీదుగా అల్పపీడనం దిశగా వీస్తున్నాయి. రానున్న 2, 3 రోజుల్లో వాడగాల్పుల తీవ్రత మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


కాగా ఆదివారం వరకు బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్లో బంగాళాఖాతంలో ఏర్పడ్డ మొదటి తుఫాను.. కారణంగా ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్షసూచన ఉందని నిపుణులు తెలిపారు. బెంగాల్, ఉత్తర ఒడిషా, మిజోరాం, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశముందన్నారు. తుఫాను నేపథ్యంలో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారుతుందని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దంటూ అధికారులు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మంత్రివర్గ విస్తరణపై రేవంత్ రెడ్డి ఫోకస్..!

పోలీసులకు నోటీసులు పంపిస్తా..: శ్రీకాంత్

పిన్నెల్లికి ముందస్తు బెయిల్‌

ఇద్దరికీ ఇదే లాస్ట్‌ చాన్స్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 24 , 2024 | 10:49 AM

Advertising
Advertising